Sunday, May 5, 2013

రాయలసీమ కథాసాహిత్య చరిత్రలో ‘భారత కథానిధి’పత్రిక

యోగివేమన విశ్వ విద్యా లయం 2006 సంవత్సరంలో ప్రారంభమై బోధనతో పాటు, 2010 నుంచి పరిశోధనను కూడాప్రారంభించింది.ఈవిశ్వ విద్యాలయంలోని అనేక శాఖలు పోటీలు పడి పరిశోధనలు చేస్తు న్నాయి. అధ్యాపకులు ఒకవైపు తమ సొంత పరిశోధన ప్రాజెక్టుల నిర్వహణలో నిమగ్నమౌతూ, మరో వైపు తమ పరిశోధక విద్యార్ధుల చేత విలువైన పరిశోధనలు చేయిస్తున్నారు. ఈ కృషిలో తెలుగు శాఖ కూడా పాలు పంచుకుంటున్నది.2010లో మొదటి బ్యాచ్‌ పరిశోధక విద్యార్ధులు చేరగానే అధ్యాపకులు ఒక్కొక్కరు ఒక్కొక్క సాహిత్య ప్రక్రియను తీసుకొని అందులో వచ్చిన రాయలసీమ సాహత్యం మీద పరిశోధన చేయించాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా నలుగురు పరిశోధకులకు రాయలసీమలో నుండి ఆధునిక కాలంలో వచ్చిన సంప్రదాయ కవిత్వం, రాయలసీమ నవల, రాయలసీమ కథానిక, రాయలసీమ సాహిత్య విమర్శ- అనే అంశాలను ప్రారంభంనుండి 1950 వరకు ఇచ్చారు. కథానికకు మాత్రం 1980 వరకు కాలపరిమితి నిర్ణయించారు. ఇప్పటి దాకా వచ్చిన తెలుగు సాహిత్య చరిత్రలో రాయలసీమ సాహిత్యానికి పెద్దగా స్థానం ఇవ్వలేదు. ఇప్పుడు యోగివేమన విశ్వవిద్యాలయంలో రాయలసీమ సాహిత్యం మీద జరుగుతున్న పరిశోధనలలో- ఇప్పటిదాకా పరిశోధకులు, విమర్శకులు గుర్తించని అనేక నవలలు, కథానికలు, విమర్శనా వ్యాసాలు, పద్యకావ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే రాయలసీమ నుండి రెండేళ్ళు, మూడేళ్ళు, నాలుగేళ్ళు ప్రచురితమై ఆగిపోయిన కొన్ని పత్రికలూ వెలుగులోకి వస్తున్నాయి. 
తెలుగు కథానికకు రాయలసీమనుండి వేదికగా పనిచేసిన ‘భారత కథానిధి’ అనే మాస పత్రిక ఒకటి.ఈ పత్రికకుఈ
పత్రిక 1926 జూలై నుండి 1930 ఆగస్టు వరకు వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రచురితమైంది. ఈ పత్రికకు పైడిమర్రి పిచ్చయ్య చౌదరి వ్యవస్థాపకులు, ఎన్‌. రామ సుబ్బయ్య శ్రేష్ఠి ప్రకాశకులు, సి. నరసరాయ శాస్త్రి ప్రధాన సంపాదకులు. ఈ నాలుగేళ్ళలో ఈ పత్రిక 40 సంచిలను తీసుకొచ్చింది. 1813లో ప్రారంభమైన ‘ఆర్య వైశ్య పుస్తక భాండాగారము’ ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో నడిచే ‘శ్రీ కన్యకా పరమేశ్వరి’ ముద్రణాలయం నుండి వెలువడింది. ఈ పత్రిక ప్రారంభ సంచికనుంచి కథలకు పెద్దపీట వేసింది. ఈ పత్రిక ప్రారంభించినప్పటినుండి పత్రిక నిలిచిపోయేవరకు, ఈ పత్రిక మొదటి పేజీలో భారతంనుండి స్వీకరించిన ఒక ఆటవెలది పద్యాన్ని ముద్రించారు. అది- ఆ.వె. 
నీతిలేని వాని నిందించు లోకులు లేదు సేగిలాతి లేకయున్నం/ గాన మానవుండు పూనిక నయవిద్య గడనసేయ మొదలగడంగవలయు- (భారతం) ఈ పత్రిక వెలుగులోకి రావడం వలన కలిగిన ప్రయోజనం ఏమిటంటే-
రాయలసీమ కథానిక 1941లో ప్రారంభమైందని, అంతకు ముందు రాయలసీమ నుంచి కథానికలు రాలేదని విద్వాంసులలో ఉన్న అభిప్రాయం సవరించుకోవడానికి అవకాశం రావడం. భారత కథానిధి పత్రిక 1926 జూలైలో ప్రారంభమైనప్ప టినుంచి కథానికకు ప్రముఖ స్ధానం ఇచ్చింది. ఈ పత్రికలో ఇటు రాయల సీమ కథకులు అటు ఇతర ప్రాంత కథకులు కూడా తమ కథలను ప్రచురించుకొని తెలుగు కథను అభివృద్ధిచేశారు. ఈ పత్రికలో దాదాపు 30 మందికి పైగా కథారచయితలు దాదాపు 115 కథలు రాశారు.

కులం, మతం, స్ర్తీ వివక్ష, కన్యాశుల్కం, వరకట్నం, నీతి, ఆధ్యాత్మికం, సంప్రదాయం, అధికారుల అవినీతి మొదలైన అన్ని అంశాలపై కథలు వెలువడ్డాయి. నాటి కథారచయితలలో అయ్యగారి నరసింహమూర్తి, బొగ్గరపు నాగవరదయ్య శ్రేష్ఠి, వెల్లాల మైసూరయ్య, యం.వి. పాపన్న గుప్త, దోమావెంకటస్వామిగుప్త, హెచ్‌. మహ్మద్‌ వియ్యాక్‌, పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ, పూతలపట్టు శ్రీరాములరెడ్డి, రూపావ తారం శేషశాస్ర్తి, మాలేటి వెంకటరావు, వి. వసంతరావు, కిదాంబి రామచంద్రాచార్యులు, అవధానం సుందరం, కైప శేష శాస్త్రి, సి. విశ్వేశ్వర శర్మ, వి. భాస్కరరావు, కందాల శేషాచార్లు, ఎస్‌. దస్తగిరి మొదలైన ఎందరో రాయలసీమ, రాయలసీమేతరులు కథలు రాశారు. వీరిలో కొందరికి తెలుగు సాహిత్యంలో స్థానం ఉండకపోవచ్చు.

కానీ ఎందరినో ‘భారత కథానిధి’ సంపాదకులు, వ్యవస్థా పకులు కథారచనకు ప్రోత్సహించి వారిచే గొప్ప కథలు ప్రపంచానికి అందించారు.భారత కథానిధి పత్రికను పరిశీలించిన పిదప ఆధారాలు లభిస్తున్నంతలో తొలి రాయలసీమ కథా సాహిత్యానికి ఇంతగా తోడ్పడిన పత్రిక మరొకటి లేదని అర్థం అవుతుంది. ప్రొద్దుటూరులో నేటికీ 1813నాటి ‘శ్రీ ఆర్యవైశ్య పుస్తక భాండాగారము’ నడుస్తోంది. ఎందరో సంప్రదాయ కవులు కూడా ఈ పత్రికలో ఆధునిక భావాలతో కథలు రాశారు. రాయలసీమ కథాసాహిత్య చరిత్రలో ‘భారత కథానిధి’ మాసపత్రిక వెలుగులోకి రావడం ఓ చారిత్రక విజయం
పైడిమర్రి పిచ్చయ్య చౌదరి వ్యవస్థాపకులు, ఎన్‌. రామ సుబ్బయ్య శ్రేష్ఠి ప్రకాశకులు, సి. నరసరాయ శాస్త్రి ప్రధాన సంపాదకులు. ఈ నాలుగేళ్ళలో ఈ పత్రిక 40 సంచిలను తీసుకొచ్చింది. 1813లో ప్రారంభమైన ‘ఆర్య వైశ్య పుస్తక భాండాగారము’ ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో నడిచే ‘శ్రీ కన్యకా పరమేశ్వరి’ ముద్రణాలయం నుండి వెలువడింది. ఈ పత్రిక ప్రారంభ సంచికనుంచి కథలకు పెద్దపీట వేసింది. ఈ పత్రిక ప్రారంభించినప్పటినుండి పత్రిక నిలిచిపోయేవరకు, ఈ పత్రిక మొదటి పేజీలో భారతంనుండి స్వీకరించిన ఒక ఆటవెలది పద్యాన్ని ముద్రించారు.

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...