Tuesday, November 26, 2013

భౌగోళిక సమగ్రతే రాయలసీమకు రక్ష - లెక్కల వెంకటరెడ్డి

రాయల తెలంగాణ ప్రతిపాదన పాతదే. రాయలసీమకు చెందిన ఇద్దరు ముగ్గురు అధికార పార్టీ నేతలు ప్రతిపాదనను తీసుకురాగా సీమ ప్రజానీకం దాన్ని ఆనాడే ఒక జోక్ కింద కొట్టిపారేసింది. కొందరు సీమ అభిమాన ధనులు మాత్రం ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా ఖండించారు. మరికొందరైతే దాన్ని తెర ముందుకు తెచ్చిన నేతలపై దుమ్మెత్తిపోసారు. అంతటితో సద్దుమణగవలసిన ప్రస్తావన ఇటీవలి కాలంలో తరచూ తెరపైకి వస్తూండడం రాయలసీమ చరిత్రను అధ్యయనం చేసిన నిష్ణాతులకు మింగుడు పడడం లేదు. రాయలసీమ అస్తిత్వానికే ముప్పుగా పరిణమించే ప్రస్తావనను సీమ వాసులతో పాటు రాజకీయ పార్టీ కూడా మొన్నటి వరకూ స్వాగతించలేదు. అందువల్లనే రాయల తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కాలమే అంశాన్ని వెంటనే తెరమరుగు చేస్తూ వస్తోంది.
రాష్ట్ర విభజనకు సంబంధించి బిల్లు ముసాయిదాను రూపొందించేందుకు ఏర్పాటైన జీవోఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) విభజనకు సంబంధించిన 11 అంశాలను సూత్రీకరించి రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరింది. తెలుగుదేశం మినహా ఆహ్వానాన్ని అందుకున్న మిగతా పార్టీలన్నీ జీవోఎం ముందు హాజరై తమ అభిప్రాయాలను వివరించాయి. కోవలో మజ్లిస్ పార్టీ తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ రాయల తెలంగాణను ఏర్పాటు చేయవలసిందిగా సూచించింది. అయితే సీమ మొత్తంగా కాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాలను మాత్రమే తెలంగాణలో కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరటం గమనార్హం! ఇది రెండు జిల్లాలకు చెందిన కొందరు అధికారపార్టీ నేతలు చేస్తున్న ప్రతిపాదనకు నకలు తప్ప ఇంకోటి కాదు. గతంలో కూడా ఒక సందర్భంలో మజ్లిస్ రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చింది. అయితే ఇప్పటిలా సీమ భూభాగాన్ని విభజించి రెండు జిల్లాలను మాత్రమే తెలంగాణతో కలపాలని చెప్పలేదు. మజ్లిస్ ఇలా వ్యవహరించటానికి కారణాలేమిటో అన్వేషించాలి.
మజ్లిస్ ఒకటి రెండు సందర్భాలలో రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చినప్పటికీ మొత్తానికి అది రాష్ట్ర సమైక్యతనే కోరుకుంటోంది. విషయాన్ని మజ్లిస్ చాలా సందర్భాలలో స్పష్టం చేసింది. అందుకే సీపీఎం, వైఎస్ఆర్ పార్టీలతో పాటు మజ్లిస్ కూడా రాష్ట్ర సమైక్యతకే కట్టుబడి ఉందని మీడియా మధ్య తరచూ పేర్కొంటూ వచ్చింది. ఇటీవల జీవోఎం ముందు కూడా మొదటగా తాము రాష్ట్ర సమైక్యానికే ప్రాధాన్యం ఇస్తామని మజ్లిస్ నాయకులు చెప్పారు. విభజన అనివార్యమైన నేపథ్యంలో హైదరాబాద్ను యూటీ చేస్తే తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లిం మైనార్టీలకు తరచూ సమస్యలు తలెత్తుతాయని, అందువల్లే యూటీ ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. హైదరాబాద్ను తెలంగాణలోనే ఉంచి అదనంగా కర్నూలు, అనంతపురం ప్రాంతాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటును కోరుతున్నట్లు వివరించారు.
రాయలసీమలోని రెండు జిల్లాల్లో ముస్లిం మైనార్టీలు గణనీయ సంఖ్యలో ఉన్నారని జిల్లాలను తెలంగాణలో కలిపితే తమ మైనార్టీల పరిస్థితి కాసింత మెరుగ్గా ఉంటుందని జీవోఎంకు మజ్లిస్ విశదీకరించింది. వాస్తవం ఏమైనప్పటికీ కేవలం మైనార్టీల ప్రయోజనాల కోసం ఒక ప్రాంత భూభాగాన్ని నిలువునా చీల్చాలని కోరడం హర్షించదగ్గ పరిణామం కాదు. ఇది సీమ చీలిక వాదులకు, వారిని ప్రేరేపిస్తున్న దుష్టశక్తులకు మరింత ఊతమిస్తుందని మజ్లిస్ నాయకులు గ్రహించకపోవడం విచారకరం. వారు రాయలసీమ భౌగోళిక రూపం, సంస్కృతీ సాంప్రదాయాలను పరిపాలనా క్రమ వ్యవస్థను పరిగణనలోనికి తీసుకోకపోవడమే అందుకు ప్రధాన కారణంగా భావించాలి.
మద్రాసు ప్రావిన్స్ నుంచి తెలుగువారంతా విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు రాయలసీమ సమగ్రంగానే తిరస్కరించింది. రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని సీమ యావత్తు తేల్చిచెప్పింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు 40 ఏళ్ళ ముందు నుంచే సీమ మొత్తంగా ప్రత్యేక డిమాండ్స్తో తన సమగ్రతను చాటుకుంటూనే ఉంది. ప్రస్తుత రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమ యావత్తూ సమైక్యతకు కట్టుబడి ఉంది. విభజన అనివార్యమైతే తన సమగ్ర ప్రతిపత్తిని కాపాడుకుంటూ ప్రత్యేక రాయలసీమ కోసం సీమ గొంతుకలతో తన స్వరాన్ని వినిపించేందుకు సిద్ధంగానే ఉంది.
రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చిన సీమ నేతలు దాన్ని తీసుకురావటం వెనుక వారి వ్యాపార లావాదేవీలకు స్థానికత అంశం చేకూర్చుకోవడమే ప్రధానమైనప్పటికీ అదొక్కటే కారణంగా కనిపించడం లేదు. అదే కారణమైతే ప్రతిపాదన ఇంత వడివడిగా బలంగా అడుగులు ముందుకేసేది కాదు. కొన్ని పత్రికా కథనాలు తెలుపుతున్నట్లు కేంద్రం దురుద్దేశం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు అనిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కుట్రపూరిత పథక రచన దీని వెనుక ఉన్నట్లు కనిపిస్తోంది. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు బిల్లుకు మెజారిటీ అభిప్రాయాలు సాధించుకునేందుకు రాయల తెలంగాణ పేరుతో సీమ ప్రాంతంలోని సగం మంది శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు యత్నిస్తోంది. అంతేకాకుండా సీమ వాసులు ప్రత్యేక రాయలసీమ డిమాండ్ను తీసుకువచ్చి తలబొప్పి కట్టిస్తారనే భయం కూడా రాయల తెలంగాణలో భాగమౌతోంది.
రాయల తెలంగాణ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉన్నట్లు హోం శాఖ వర్గాలు చెబుతూండడంపై వాదనలకు బలం కలిగిస్తోంది. అందుకే రెండు జిల్లాల కాంగ్రెసు నేతలు తమ ప్రతిపాదన సార్వజనీకమైనదని నమ్మబలుకుతున్నారు. మార్గంలో సదస్సులు సమావేశాలు జరిపేందుకు సిద్ధమౌతున్నారు. అందుకు పార్టీ ఢిల్లీ పెద్దలు పరోక్ష ప్రోత్సాహమిస్తూ జిల్లాల కాంగ్రెసు నేతలు ఒకరొకరుగా మద్దతు ఇచ్చే విధంగా వారిని పురికొల్పుతున్నారు.
రాష్ట్ర విభజన అనివార్యమవుతున్నందున అనంతపురం, కర్నూలు జిల్లాలు సాగునీటి సమస్యల సుడిగుండంలో చిక్కుకోకూడదన్న ఉద్దేశంతోనే తాము రాయల తెలంగాణప్రతిపాదన చేసినట్లు ప్రాంత అధికార పక్షనేతలు చెబుతున్నారు. అది సహేతుకంగా కనిపించడం లేదు. రాయలసీమకు సాగునీరు తుంగభద్ర, కృష్ణల నుంచే అందాలి.
వేరే దారిలేదు. నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ రెండు జిల్లాలకే సంబంధించినవి కావు. అన్నీ కూడా తెలంగాణతో పాటు సీమ నాలుగు జిల్లాలకు ప్రతిపాదించబడినవి. తుంగభద్ర జలాలు సీమ వాటాలో సింహభాగం అనంతపురానికే కేటాయించినప్పటికీ అవి రాకపోవడం వల్లనో లేదా చాలకపోవడం వల్లనో కర్నూలు కడప కాలువకు (కె.సి.కెనాలు) కేటాయించిన నీటిలో 10 టీఎంసీలను అనంతపురానికి కేటాయించారు. ప్రస్తుత ప్రతిపాదనతో నీటిలో కొంత శాతం కోతకు గురౌతుంది. అలాగే కృష్ణా జలాల ఆధారంగా నిర్మించబడుతున్న - నిర్మించిన ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులు ప్రతిపాదిత సీమ ప్రాంతానికి మొత్తంగా నీరందించేవే కానీ రాయల తెలంగాణలో భాగమైనంత మాత్రాన అనంతపురం కర్నూలు జిల్లాలకే పరిమితం కావు.
ఒకవేళ తెలంగాణ వారి సహకారంతో ప్రాజెక్టుల సాగునీరు జిల్లాలకే పరిమితం చేసుకోవచ్చని భావిస్తే అది వారి అత్యాశే లేదా వారి అజ్ఞానమే అవుతుంది. పైగా రెండు జిల్లాలకు కానీ నాలుగు జిల్లాలకు కానీ ప్రాజెక్టులకు సజావుగా సాగునీరు రానిస్తారని తెలంగాణ వారిని విశ్వసించటానికి వీలులేదు. ఎందుకంటే కృష్ణానదిపై శ్రీశైలం ఎగువభాగాన ఉన్న జూరాల ద్వారా మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోని ఎగువ ప్రాంతాలకు నీరు తీసుకుపోయే విధంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే జూరాల నుంచి 70 టీఎంసీల ఎత్తిపోతల నీటి పథకానికి జీవో జారీ అయ్యింది. అందువల్ల రెండు సీమ జిల్లాలకు ప్రత్యేకంగా జరిగేదేమీ ఉండదు. రాష్ట్రం యథాతధ స్థితి కొనసాగితే తప్ప సీమకు సాగునీరు సవ్యంగా అందదు. లేదా ప్రత్యేక రాయలసీమలో ప్రత్యేక హక్కు ఒడంబడికల ద్వారా సాగునీటిని సాధించుకునేందుకు వీలు కలుగుతుంది తప్ప రాయల తెలంగాణతో ఎవ్వరికీ మేలు కలుగదు.
రాయలసీమ అస్తిత్వానికి, వేలాది సంవత్సరాల దాని సమగ్ర చరిత్రకు తీవ్ర హాని తలపెట్టిన కేంద్రం దుశ్చర్యలను, దుర్మార్గాలను, కుట్రలను, కుయుక్తులను తిప్పికొట్టేందుకు రాయలసీమ సమాయత్తం కావాలి. అందుకు రాయల తెలంగాణ ప్రతిపాదిత నేతలే నడుం కట్టాలి. సీమ వాసులు ముక్త కంఠంతో తమ చారిత్రక నేపథ్యాన్ని ఎలుగెత్తి చాటాలి. చేజార్చుకున్న సాగునీటి అవకాశాన్ని పొందటం తమ హక్కుగా నేను స్వరం వినిపించి పోరాడి సాగునీరు సాధించుకోవాలి.
చివరగా ఒక మాట. తుది వరకు సమైక్య బాట నడిచిన సీమ తన వంతు పోరాటం సాగించాలి! సమైక్యం వీలుకాని పక్షంలో శ్రీబాగ్ ఒండబడిక అమలును కోరుదాం! అదీ కుదరకపోతే సీమ భౌగోళిక సమగ్రతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా భౌగోళిక చారిత్రక అవసరాలతో ముడివడియున్న పాత రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాతో కలిసి గ్రేటర్ రాయలసీమను సాధించుకోవాలి. అదే సీమ సమగ్ర చరిత్రకు ఘనమైన సత్కారం!
-
లెక్కల వెంకటరెడ్డి
రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి ANDHRAJYOTHY 26-11-2003

సీమవాసుల తలుపు తట్టిన అదృష్టం!- వత్సల విద్యాసాగర్

నిజ్జంగా ఇది నిజం సుమా. జరిగింది మంచి కాదు, గానీ మంచికే జరిగింది. సహజసిద్ధం గానే ఒక దగ్గర కిటికీ మూసుకుపోతే నీకోసం మరెక్కడో తలుపులే తెరిచి ఉంటా యంటారు. ఇలాగే అనాలోచితంగా ఇంకో రెండు తరాలనో, నాలుగు తరా లనో తగలబెట్టాక ఇప్పటి స్థితి ఎదురైఉంటే! ఏమయ్యే ది?ఎంత కాదనుకొన్నా ఎన్ని విధాల సరిపెట్టు కుందామన్నా జరిగిన నష్టం వెలకట్ట గలిగేది కాదు, కొలవగలిగేదీ కాదు. కాకుంటే ఈ అనుభవం- ‘ఆగి, ఆలోచించ’మనే సత్యాన్ని ఉద్బోధిస్తుంది. ‘చీమా చీమా ఎందుక్కుట్టావ్‌?’ అంటే ‘నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?’ అందట. అట్లాంటిది. రోషం, పౌరుషం ఎక్కువ సీమవాసులకు- అందరూ చెప్పేమాటే! కాదు కాదు ఉన్నమాటే! స్వతంత్రంగా బ్రతకాలనే ఆలోచనే రోషం. స్వతంత్రంగా బ్రతకడమే పౌరుషం. సీమవాసులకు ఇవి రెండూ పుష్కలంగా ఉండటం వల్లనే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ‘పాలెగాళ్ళ’ చరిత్రకు చిరునామా కాగలిగారు. అలాంటి సీమవాసులు ఇంత జరుగుతున్నా నిస్తేజంగా నిర్వీర్యంగా ఎందుకు ఉంటున్నారనేది వేయి ముళ్ళ చిక్కుప్రశ్న.వంగేవాడికి ‘వంగి సలాం’ చేసే సంస్కృతిలో బతికే వారొకరు, ‘బాంచెన్‌ దొర నీ కాల్మొక్త’ అనేవాళ్ళు ఇంకొకరు- ఇద్దరూ కలిసి సీమ అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసిన నేటి పరిస్థితి?

ఈ 60 సంవత్సరాలలో రాష్టప్రతి నుండి ముఖ్యమంత్రిదాకా దాదాపు 50 సంవత్సరాలు- శక్తిమంతమైన నాయకులను అందించిన సీమను మాత్రం- అటు ఆంధ్రవాసుల, ఇటు తెలంగాణీయుల చేతులలోనేకాక, వారి వారి స్వలాభం, కుటుంబలాభం, కులలాభం, వర్గలాభాలను మాత్రమే దృష్టిలోఉంచుకొని పాలన సాగించే దుర్మార్గపు సొంతఇంటి నాయకుల చేతిలో నల్లమందు కలిపిన పాలుత్రాగి మెదడు సచ్చుబడినదానిలా ఆలోచనారహిత స్థితిలోకి నెట్టారేమో! అనిపిస్తూ ఉంటుంది.లేకపోతే 60 ఏండ్ల బతుకు తగలబడిపోతే సీమవాసులు ‘సమైక్యవాదం’లో పడి కొట్టుకు పోతుండటమేమిటి? ‘అణచివేత’కు పదహారణాల ఉదాహరణఅయిన తెలంగాణీయులు ఉద్యమం చేయడం అర్థరహితం కాకపోవచ్చు. దుర్మార్గం, దోపిడీ ఉన్న దగ్గరంతా తిరుగుబాటు రావటం సహజం. సహృదయంతో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం వాళ్ళు ఎన్నుకొన్న మార్గాలు,ఆచరించిన విధానాలే ఆశ్చర్యపరుస్తాయి.బహుశా అలాంటి తెలివి, ప్రకియలన్నీ ఆంధ్రవాసులనుండి తెలంగాణవాళ్ళు నేర్చుకొన్నా రేమో! అనిపిస్తుంది. ‘నీ సొంత తెలివి లేకుంటే మానె, పక్కోడ్ని చూసయినా నేర్చుకో’ అన్నట్లు -ఈ విషయంలో తెలంగాణవాసులు నాలుగడుగులు ముందేఉన్నారు. కానీ సీమవాసులే వెనుకబడిఉన్నారు. ఇరుగు-పొరుగుల్నిద్దరినీ నిశితంగా గమనించి నేర్చుకోవాల్సింది ఆచరించాల్సిందీ సీమవాసులకు చాలానే ఉంది.

సమాజంలో ఏవైనా రాజకీయ, ఆర్థిక, సామాజిక గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పుడు అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు మేధావివర్గం- సమస్య, దానిమూలాలు, కారణాలు, విశ్లేషణలతో దిశ- నిర్దేశాలను సూచిస్తుంది. కానీ దౌర్భాగ్యమో దురదృష్టమో తెలియదు, ‘సీమ’ అస్తిత్వం నేపథ్యంలో మేధావివర్గం కించిత్‌ మౌనమే వహిస్తూంది. బహుశా ఆ వర్గం కూడా ప్రభావాలకు లోనై ‘సమైక్య’ భ్రమలోపడి కొట్టుకుపోతుండటం కావచ్చు. సాహితీలోకం- పీడితవర్గం వైపునుండి తమ కలంతో అక్షరాల స్వరాలను కూర్చి ప్రజల్ని ఆలోచింపచేసి, చైతన్యపరిచి,ఉద్యమస్ఫూర్తిని నింపుతూ వాళ్ళపక్షం నిలబడు తుంది. తెలంగాణ విభజన ఉద్యమ నేపథ్యంలో తెలంగాణకు మద్దతు తెలుపుతూ కవిత్వం, కథలు, వ్యాసాలు వ్రాయటం ద్వారానేకాక సభలు, ఊరేగింపులు, ఉపన్యాసాలద్వారా ప్రత్యక్షంగా వాళ్ళతో స్వరం కలిపి ప్రముఖపాత్ర పోషించిన తెలంగాణేతర సాహితీవేత్తలు సీమపట్ల ఎందుకు బాధ్యతా రాహిత్యంగా ఉన్నట్లు? మూగపోయిన స్వరాలతో గొంతు పెగలని స్థితిలో ఎందుకు ఉన్నట్లో!

కొంత చిన్నబుచ్చుకొనే అంశమైనా ఎంతోకొంత ఆలోచించాల్సిన, గమనించా ల్సిన అంశం - కొంతమంది సీమేతరులు- తెలంగాణీయులే సీమపట్ల ఛిౌఛ్ఛిటతో ఉండటం ఆనందించాల్సిన విషయం. వీటన్నింటికీ బలాన్ని చేకూ రుస్తూ ప్రచారంలో తీసుకువచ్చే పని చేయాల్సిన మీడియా ఒక రాష్ట్రం-నాలుగు ప్రాంతాల సమస్యలతో ముడిపడి ఉంటే తెలంగాణ ప్రాంతంవైపు మాత్రమే పనిగట్టుకొని ప్రచారం చెయ్యడం- వెనుక లోగుట్టు పెరుమాళ్ళకెరుక!
తెలంగాణవాదంలో గమనించాల్సిన వాటిలో కొన్ని ప్రధానమైనవాటి గురించి మాట్లాడు కుంటే, స్వయంపాలన కానిదేదయినా పీడనతో కలిసిపోయి ఉంటుందనేది వాస్తవం. నిజానికి తెలంగాణ అరాచకాలకు, అణచివేతలకు గురయింది- విలీనానికి ముందు అనేది గమనిం చాల్సిన విషయం. విలీనం తర్వాత ఈ 60 సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నారు. మరి ఈ 60 సంవత్సరాల ప్రజాస్వామ్య పాలనని కూడా కలుపుకుంటూ తెలంగాణ ఉద్యమం వందేళ్ళనుండి చేస్తున్నట్లు లెక్కలుచెప్పటం ఏమిటి? లేక- ఈ 60 ఏళ్ళ ప్రజాస్వామ్య పాలనలో తెలంగాణ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించినవాళ్ళు తెలంగాణ నాయకులుకారా? తెలంగాణ నాయకులే అయిన జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, అంజయ్య తెలంగాణకు ఏమీ చెయ్యలేదా? చెయ్యనట్లయితే మరి వాళ్ళనాయకులే ఏమీ చెయ్యకపోతే ఇతరుల మీద నిష్టూరం ఎందుకు? పోనీ తెలంగాణకు చెయ్యనివి ఏవైనా సీమాంధ్రలకు చేసిఉంటే ఈ రోజు అవి ఎందుకు చూపెట్ట లేకపోతున్నట్లు? లేక సీమ నాయకులు సీమకు మాత్రమే చాలా చాలా చేసిఉంటే అవన్నీ ఎక్కడికెగిరిపోయినట్లు?
విపరీతమైన పబ్లిసిటీని, సానుభూతిని సంపాదించగలిగిన అంశం -తమకు రావలసిన కొన్ని వేల ఉద్యోగాలని తమకు రాకుండా చేశారని. అందులో ఎంత వాస్తవముంది? అనేది - ప్రభుత్వం ఎన్నెన్నిట్ఛఛిటఠజ్టీఝ్ఛ్టట ని ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఏఏ ఎై ల ప్రకారం భర్తీచేస్తూ వచ్చింది ఊ్కఎైల సంఘం పూర్తి వివరణ ఇచ్చింది. ఒకవేళ ఆ వివరణలో నిజం లేదనుకొన్నా, లేకున్నా- 60 సంవత్సరాల కాలం ఒక ప్రాంతపు అభివృద్ధి = ఇంకో ప్రాంతపు వేల ఉద్యోగాల(సమానమ)వుతాయా? -అందులో సీమవాసులు పొందిన వాటా ఎంత? ఖీూఎై’ట, ఊ్కఎై’ట రెండింటినీ అడిగి చూడాలి.

గొప్ప సెంటిమెంటు విషయమే మరొకటి చూద్దాం- ప్రాణత్యాగాలకు ప్రతిరూపం తెలంగాణ ఉద్యమం- అని, ‘మన పట్నం వాళ్ళది ఎట్లైతది?’లాంటి ప్రచారాలు- ‘తాజ్‌మహల్‌కు రాళ్ళెత్తిన కూలీలెవ్వర’న్నట్లుగా సమాజంలో ఏ గుర్తింపూ లేనిది శారీరక శ్రమ. ఇందుకు ఎవరూ అతీతం కాదు. మనుషులు ప్రాణాలను పోగొట్టుకోవడం- వాళ్ళు ఎక్కడివాళ్ళయినా ఎవరయినా అది విషాదం. విషాదం కొలమానంగా ఆలోచించడం ఏ విధంగానూ భావ్యం కాదు. 1956 తర్వాత విస్తరించిన నగరంలో తెలంగాణేతరులు ప్రాణాలు కోల్పోలేదా? విలీనం తరువాత పీడనని వ్యతిరేకించే దిశలో వచ్చిన ఉద్యమాలు ఏవయినా అన్ని ప్రాంతాలవారి భాగస్వామ్యంతోనే జరిగాయి. ప్రజాస్వామ్యం ముసుగులో జరిగిన అన్ని రకాల దాష్ఠీకాలను ప్రశ్నించి, నిలదీస్తూ ఎదురుతిరిగి ముందుకు సాగిన నక్సలైటు ఉద్యమం మొదలు బషీర్‌బాగ్‌ కరెంటు ఉద్యమం వరకు పోరాటం చేసినవాళ్ళు కానీ ప్రాణాలు కోల్పోయినవారు గానీ తెలంగాణేతరులు లేరా? ఉంటే వారి త్యాగాలు వారివారి ప్రాంతాలనుద్దేశించి మాత్రమే చేసినవా? లేకపోతే అలాంటి వాళ్ళ ప్రాణత్యాగాలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదా? వినాయక చవితి వస్తూందంటే చాలు పాతబస్తీవాసులు పునరావాస కేంద్రాలకు వచ్చినట్లు మూటాముల్లె సర్దుకొని పాతబస్తీ బయట ఆ కొద్దిరోజులు తలదాచుకున్న చరిత్ర ఎట్లాఅప్పుడే మరుగ యింది? పాతబస్తీ వాసులలో 99% తెలంగాణవాసులే ఉంటారు. అట్లా వచ్చిన వాళ్ళకు ఆశ్రయమిచ్చినవాళ్ళలో తెలంగా ణేతరులు లేరా?

అటు అల్లూరి నుండి, ఇటు తరిమెల నాగిరెడ్డి పోరాటం వరకూ ఎవరినుద్దేసించి చేసినవి? వాటి ఫలాలు ఎవరు అనుభవించారు? ఎవరికి చెందాయనుకొందాం? మనందరికీ చెందాయని చెప్పడానికి క్షణమాత్రం కూడా సంశయించక్కరలేదు. చరిత్ర ఎప్పుడూ పునాదేకానీ భవంతి కాలేదు. ‘మినార్‌’లలోనో, కోట బురుజు ల్లోనో, కందకం లోతుల్లోనో వెలసిపోయిన చరిత్రని అణగారిన గతాన్ని పోల్చుకొంటూ పోతే నీకొకటి ఉంటే నాకు రెండు అనొచ్చు. ఆ మాటకొస్తే రాజరికవ్యవస్థే ప్రజాపాలనకు వ్యతిరేకం. రాజ్యాలు పోయిరి, రాజులు పోయిరి, కానీ ‘రాజకీయ’మట్లనే ఉండిపోయింది. అది ఉన్నన్నాళ్ళు రాజ్యకాంక్ష ఉండనే ఉంటుంది. రాజ్యకాంక్ష లేని రాజకీయమూ లేదు, రాజకీయ నాయకుడూ లేడు.అభివృద్ధి అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులు పెరగటమూ కాదు, ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వపు నియోజకవర్గంలో తారురోడ్లు తళతళలాడడమూ కాదు. మూడుపూటలా ఐదువేళ్ళూ నోటికందక అలమటించేవారి సంఖ్య అంతరించిపోవటం! మరో అంశం ‘భాష’. అడుగడుగునా, అవమానాల పర్వం మాది అంటున్న తెలంగాణ భాష కమెడియన్లకు వాడుతున్నారు అన్నది వాస్తవం. కానీ కథలో ప్రధాన పాత్రలు ఏ్ఛటౌ, గి జీజూజూౌ. అలాంటి ‘ప్రధానపాత్ర’ల్లో ఒకటైన విలన్‌ పాత్రనే ‘సీమ’కు క్టబెట్టి, సీమది బాంబుల సంస్కృతి గా చిత్రీకరిస్తే మరి సీమవాసులకెంత కోపం, పౌరుషం రావాలి! అదొక గొప్పదనంగా భావించి, ప్రత్యేకతగా తీసుకుందామా?

తెలంగాణవాదులది చిన్న రాష్ట్రాల ప్రతిపాదనే అయితే, రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ప్రతి పాదనను ఎందుకు విభేదిస్తున్నట్లు? ఒకవైపు ఎక్కడో ఉన్న విదర్భ ప్రతిపాదనను టఠఞఞౌట్ట చేస్తూ, ఇక్కడ సీమ గురించి మాట్లాడితే నచ్చకపోవటం ఎందుకు? అంత కోల్పోయినా సీమవాసులు స్పష్టంగా ఉంటే సమైక్యం- లేకుంటే మూడు రాష్ట్రాలు కావాలంటే ఏ ఒక్కరికీ మింగుడుపడని పరిస్థితి ఎందుకుంది? ఒక్క తెలంగాణవాదులే కాక అటు చిన్న రాష్ట్రాల ప్రతిపాదనే అజెండాగా సాగే బిజెపి కానీ, కాంగ్రెస్‌ కానీ యుపి ని నాలుగు రాష్ట్రాలు చేస్తామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? రెండు పార్టీలూ ఒక్క తెలంగాణ విభజనని మాత్రమే టఠఞఞౌట్ట చేస్తూ పక్కనే ఉన్న సీమ మాటే ఎత్తకపోవడం ఎందుకు? ‘సెంటిమెంట్‌’తో కాదు. ‘సైంటిఫిక్‌’ అంటారు. పైవన్నీ ఏమిటి? సైంటిఫిక్‌ అప్రోచ్‌తో చేస్తున్నవేనా? ఎవర్నడుగుదాం?
ఏది ఏమయినా ‘నాలుగు జిల్లాలే కదా? మీకు నీళ్ళెట్లా? మీకేం వనరులున్నాయి? పది ఎంపీ సీట్లే కదా? ఎట్లా బతుకుతారు?’ అంటూ రకరకాలుగా ప్రశ్నించే వాళ్ళకందరికీ ఒకటే సమాధానంగా- ‘మేం ఎట్లా బతుకుతామో చెప్పి ఒప్పిస్తే తప్ప- మేం విడిగా బ్రతికేందుకు మీరు ఒప్పుకోరా?’ అని అడగచ్చు- కానీ ఇవన్నీ నిజాలే కదా? ‘ఎట్లా బతగ్గలం’ అంటూ దిగులుపడే సీమవాసులదే సగం సమస్య - ఇప్పుడు నిజంగా సీమవాసులకు కావలసింది - ఖనిజసంపదో... కూచుని తింటే కొండలయినా కరిగిపోతాయంటారు- నీటివనరులో ఇప్పటివరకూ తెలంగాణ నీళ్ళిస్తే బతికామా? ఆంధ్రవాళ్ళిచ్చే నీళ్ళతో బతుకుతున్నామా?

ఎత్తిపోతలలో కానీ, మిగులుజలాల్లో కానీ మన నీళ్ళ వాటా దోచుకోలేదా? రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం పెరగడమో... పక్కనే ఉన్న కేరళ రాష్ట్రం మొత్తం కలిపినా మన రెండు జిల్లాల విస్తీర్ణం కంటే తక్కువే. ప్రత్యేక ప్యాకేజీలో... మొత్తం కాంట్రాక్టుల రూపంలో మళ్ళీ నాయకుల జేబుల్లోకే వెళ్తాయి - ఎంపీ సీట్ల సంఖ్య పెరగడమో... ఒకే ఒక్క ఎంపీ సీటు రాష్ట్రంగా కలిగిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. విశాలమైన నగరాలు లేకపోవడమో... ఒక నగరమే ఒక రాష్ట్రంగా ఉన్నవి కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదానికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. కానీ అన్నింటికంటే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం ’అజ్ట్ఛూట్చ్ట్ఛ. ‘నాకంటూ అవకాశమొస్తే తిరిగి సీమ ముంగిట రత్నాలు రాసులు పోయిస్తా’ అనే భావాలు కలిగిన యువతరం ఒక్కచోట చేరి ప్రయత్నిస్తే నిజంగా సాధ్యం కానిది కాదు. విడిగా ఒక వెలుగు వెలిగిన సీమ విలీనంలో కూడా తన బతుకు అదే బతికింది. అలాంటి సీమకు ఇప్పుడు కావలసింది తన అస్తిత్వం. ధైర్యలక్ష్మిని ఆపితే మిగిలిన అష్ట లక్ష్ములూ తిరిగి వచ్చినట్లు సీమ తన అస్తిత్వం సాధిస్తే కావలసినవన్నీ వాటంతట అవే వస్తాయి. ఏదీ లేదనుకొన్నప్పుడు - నీకు నువ్వే మిగిలినప్పుడు - గుండె నిండిన ఆత్మ విశ్వాసం అన్నింటినీ మరిపించి, నడిపించే శక్తి అవుతుంది. జరిగిన అన్యాయానికి ప్రకృతి సహకరిస్తే - దానికి సీమవాసుల పట్టుదల, ఆత్మగౌరవాలు తోడయితే, ఆలస్యంగానైనా తమకు అందివచ్చిన అదృష్టంతో తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూ...

‘మద్రాసు నుండి ఆంధ్రరాష్ట్రం విడిపోవడం లాభదాయకమైతే, ఆంధ్ర నుండి రాయలసీమ విడిపోవడం మరింత లాభదాయకం’ అని 1931 నాడే ‘రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం’ కావాలన్న మన పెద్దల ఆకాంక్షల సాకారం బాటగా... ఎగరవేసే బావుటా రెపరెపలు విశ్వాంతరాళంలో ఉనికిని చాటే క్షణాలను ఆహ్వానిస్తూ, ఆ క్షణాలకోసం పరితపిస్తున్న ఎద లోయల్లో ఆలస్యంగానైనా సీమవాసుల తలుపు తట్టబడిన అదృష్టం సాక్షిగా ఏరువాక పొంగేను. 
-సూర్య దినపత్రిక (26-11-2013) సౌజన్యంతో..! 

Wednesday, September 18, 2013

రాష్ట్రం విడిపోతే రాయలసీమ ఎడారి -ఎం.కె.కుమార్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో,సమైక్య వాదులతోపాటు ముఖ్యమంత్రి రాష్ట్రంవిడిపోతే రాయ లసీమ
ఎడారి అవుతుందని ప్రకటించారు. నిజానికి ఇప్పటికే రాయలసీమ ఎడారిగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి పాలకులు కారణంగాని రాష్ట్రం విడిపోవడం కాదు. తెలంగాణ విడిపోతున్న సందర్భంలోనూ, రాయలసీమకు రావాల్సిన, అందవలసిన నీటి వనరుల గురించి ఇప్పటికీ ఒక స్పష్టమైన వైఖరితో రాయలసీమ రాజకీయ నాయకులు ముందు కు కదలడంలేదు. దేశంలో మొత్తం సాగుభూమి185 మిలియన్‌ హెక్టార్లుకాగా, అందులో 65 మిలియన్‌ హెక్టార్లు క్షామపీడిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని క్షామపీడిత ప్రాంతాల్లో 4.5 మిలియన్‌ హెక్టార్ల సాగుభూమి ఉండగా అందులో 3 మిలియన్‌ హెక్టార్లు,రాయలసీమాలోనూ,1.5మిలియన్‌ హెక్టార్లు తెలంగాణాలోనూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విస్తీర్ణంలో రాయల సీమ 29.86 శాతముంది. రాష్ట్ర జనాభాలో 11.5 శాతం ప్రజానీకం సీమలో ఉంది. రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుంది. సముద్రమట్టం నుండి ఈ ప్రాంతం 250 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ సగటు వర్షపాతం 858 మి.మీ ఉంది. రాయలసీమలో 800 మి.మీకన్నా తక్కువ వర్షపాతమే నమోద వుతుంది. అందువల్లే ఈ ప్రాంతం కరువు ప్రాంతంగా ఉంది. ఈ వర్షపాతం రాయలసీమలో ప్రధానంగా పండిస్తున్న వేరు శనగ, కొర్రజొన్నల పంటలకు కనీస స్థాయిలో కూడా చాలడం లేదు. సాలీనా 30 శాతానికి  మించి పంటలు పండించే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరు. రాయలసీమలో ఖరీఫ్‌ పంటకాలంలో కురిసే వర్షపాతం కేవలం 365.8 మి.మీ మాత్రమే.ఇది కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండదు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి కంటే తక్కువగా అనంతపురం జిల్లాలో వార్షిక వర్షపాతం 544 మి. మీగా ఉంది. రాయలసీమలో ఎక్కువ భూమి ఎర్రనేలలుగానూ, తక్కువగా నల్లరేగడి భూములున్నాయి. ఎర్రనేలలు తేమను ఎక్కువగా నిలువచేసుకోలేవు. నేలసారం కూడా తక్కువ స్థాయి లో ఉంటుంది. రాష్ట్రంలో ఉపరితలం నీటి వనరులు 2746 టిఎమ్‌సిలు, భూగర్భజల వనరులు 1140 టిఎంసిలగానూ ఉందని అంచనా వేసారు. ఇందులో ఉపరితల నీటి వనరుల్లో గోదావరి నుంచి 1495, కృష్ణా నుండి 811 టిఎంసిలు వస్తుం దని అంచనా. రాష్ట్రంలో 113.4 లక్షల హెక్టార్ల (284 లక్షల ఎకరాలు) భూమి సాగులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి పై నీటి వనరులు మూడు ప్రాంతాల వారికీ సామా నంగా అందుబాటులోకి తీసుకురాగలిగితే 118 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించవచ్చునని నిపుణులు పేర్కొంటు న్నారు. 5వ పంచవర్ష ప్రణాళిక నాటికి నీటిపారుల సౌకర్యాల అభివృద్ధిలో కోస్తాలో 26.79 లక్షల హెక్టార్లకంటే, తెలంగా ణాలో 15.25 లక్షల హెక్టార్లు, రాయలసీమలో 6.50 లక్షల హెక్టార్లే ఉంది. ఇదికూడా ఈ మధ్యకాలంలో 30 శాతానికిపైగా తగ్గింది. దీన్నిబట్టి రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి అసమానతలు ప్రస్ఫుటంగా తెలుస్తాయి.రాయలసీమపట్ల వివక్ష ఇప్పటికే కొనసాగుతోంది. నీటివనరుల అభివృద్ధి జరుగనంత కాలం ఆ ప్రాంతం అభివృద్ధి చెందదనేది చారిత్రక సత్యం.
ఇజ్రాయిల్‌లో నెగేవ్‌ ఎడారిలో, అమెరికాలోని కాలిఫోర్నియా ఎడారిలో ఆ దేశాల వారు పచ్చని పంటలను పండించి వ్యవసా యాన్ని అభివృద్ధి చేసారు. మనదేశంలో థార్‌ ఎడారిలో అతి తక్కువ వర్షపాతం 220 మి.మీ భాక్రానంగల్‌ ప్రాజెక్టులో నీటిని,సట్లేజ్‌ నదీ జలాలను రాజస్థాన్‌ కాలువ ద్వారా ఈ ఎడా రికి మళ్లించే ప్రయత్నం వల్ల 31.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు. కరువులసీమగా ప్రసిద్ధిగాంచిన రాయల సీమలో 1876-78లో వచ్చినధాతు కరువువల్ల ఈ ప్రాంతంలో 1/3వంతు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1952-53లో వచ్చిన కురువుకు వేలల్లో ప్రజలు చనిపోయారు. రాష్ట్రంలోని 61కరువు ప్రాంతాల్లో 39 రాయలసీమలోనే ఉన్నాయి.  రాయ లసీమలో ప్రధానంగా పెన్నా, తుంగభద్ర, కృష్ణానదుల పరీవా హక ప్రాంతాల్లో ఉంది. పెన్నా పరీవాహక ప్రాంతం 56,750 చ.కి.మీ ఉండగా రాయలసీమలో 47,140 చ.కి.మీ నెల్లూరు జిల్లాలో 4,500 చ.కి.మీ ఉంది. పెన్నాలో లభ్యమయ్యే 75 శాతం విశ్వసనీయ నీటి లభ్యత ప్రకారం 123టిఎంసిలు లభిస్తే అందులో 33 టిఎంసిలు రాయలసీమ, 90టిఎంసిలు నెల్లూరు జిల్లాకు కేటాయించారు. అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా పెన్నాలో నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. తుంగభద్ర పరీ వాహక ప్రాంత విస్తీర్ణం 28,179 చ.కి.మీ కర్ణాటకలో 19, 142,ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో 9,037చ.కి.మీ ఉంది. 75 శాతం వార్షిక నీటి లభ్యత ఆధారంగా 480 టిఎంసీలు తుంగభద్ర నుండి వస్తే దాన్ని కృష్ణా నీటి వివాదం ట్రిబ్యునల్‌ రాయలసీమకు 122.7 టిఎంసీలను కేటాయించింది. కృష్ణానదీ పరీవాహక ప్రాంతం మహారాష్ట్ర,కర్ణాటక,ఆంధ్రద్రపేశ్‌లో ఉంది.
బచావత్‌ ట్రిబ్యునల్‌ 1973, 1976లలో తన తొలి, తుది నివేదికను సమర్పించాయి. దీని ప్రకారం కృష్ణానదిలో ఉన్న నికరజలాలు 2060 టిఎంసిలేనని పేర్కొంటూ మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, ఆంధ్రప్రదేశ్‌కు 800 టిఎంసిల నీటిని కేటాయించాలని పేర్కొంది. మనరాష్ట్రంలో రాయలసీమకు 122.7, కోస్తా ఆంధ్రకు 377.44, తెలంగాణాకు 266.86 టిఎంసిలను కేటాయించారు. రాయలసీమకు 110 టిఎంసిలు మాత్రమే అందుతున్నాయి. ఇది 1937 నాటి శ్రీబాగ్‌ ఒప్పందా నికి పూర్తి వ్యతిరేకమైనది. మొత్తంగా కృష్ణ, తుంగభద్ర, పెన్న, ఇతర చిన్న నదుల ద్వారా రాయలసీమకు 167 టిఎంసిల ఉప రితలజలాలు లభ్యమవుతున్నాయి. రాయలసీమలో భూగర్భ జలం 216 టిఎంసిల వరకు ఉండొచ్చని భూగర్భజల విభాగం అంచనా వేసింది. ఇందులో 50శాతం (108టిఎంసి)లు మాత్ర మే వినియోగంలోకి తీసుకురావచ్చని అభిప్రాయపడింది. ఉపరి తల భూగర్భజల నుంచి వస్తున్న 275 టిఎంసిలవల్ల 75 లక్షల ఎకరాల సాగుభూమి అవసరాలకు మాత్రమే ఉపయోగపడు తుంది. అది కూడా ఈ మధ్యకాలంలో35శాతం తగ్గిపోయింది.
రాయలసీమలో కరువు సమస్యమను తీర్చడానికి 1901లో సర్‌కోలిన్‌ సి.స్కాట్‌ ఇరిగేషన్‌ కమిషన్‌ కృష్ణా, పెన్నా బేసిన్లను కలిపి కాల్వలను తవ్వాలని సిఫార్సు చేసింది. మెకంజీ పథ కాన్ని అసలు అమలు చేయలేదు. 1927లో దత్తమండల జిల్లా నీటి పారుదల సంఘం సంగమేశ్వరం వద్ద కృష్ణానది మీద ఒక రిజర్వాయర్‌ నిర్మించి, ఆ నీళ్లను పెన్నా నది ద్వారా రాయలసీ మకు తరలించి 13 లక్షల ఎకరాలకు సేద్యపు నీరందించాలని ప్రతిపాదించారు. అలాగే 1952 సంయుక్త మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది మీద సిద్దేశ్వరం రిజర్వాయర్‌ను నిర్మించి ఏడు లక్షల ఎకరాలకు సాగునీరందించాలని కృష్ణా -పెన్నేరు పథకంలో సూచించారు. 1953లో ఖోస్లా కమిటీ కూడా కె.సి. కెనాల్‌ను 6000 క్యూసెక్కుల నీరు సరిపోయేటట్టు మార్చి కృష్ణా మీద సిద్దేశ్వరం డ్యామ్‌ నిర్మించాలని సిఫార్సు చేసింది. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమకు నీటి మళ్లింపు విష యంలో ప్రధమ ప్రాధాన్యత నివ్వాలని పేర్కొన్నారు. ఈ పథకా లన్నీ బుట్టదాఖలైనాయి. మరి ఇన్నిసంవత్సరాలు తెలుగప్రజలు సమైక్యరాష్ట్రంలో ఉన్నప్పటికీ రాయలసీమకు ఎందుకుతీరని అన్యాయం జరిగిందే సమైక్యవాదులు జవాబుచెప్పాలి.
గోదావరి జలాలు సుమారు 1480 టిఎంసిలుంటే అందులో రాయలసీమకు 200 టిఎంసిల నికరజలాల కేటాయింపు కూడా లేదు.జూరాల ప్రాజెక్టుపై హక్కును కూడా రాయలసీమ పోగొ ట్టుకోవాల్సి వస్తోంది. రాయలసీమలోని కరువుప్రాంతం దృష్టి లో పెట్టుకునే బచావత్‌ ట్రిబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్‌కుఎక్కువ టిఎం సిలను కేటాయించిందనే వాదన ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడక ముందే నిర్మించిన కర్నూలు - కడప కాలువ వాటా 40 టిఎం సిలు, తుంగభద్ర కాలువల ద్వారా వచ్చిన వాటా 62 టిఎంస ిలు కూడా బచావత్‌ అవార్డు ప్రకారం ఇచ్చిన 122.70 టిఎంసి లలో కలిసివున్నాయి.మరి రాయలసీమకు ఒరిగిందేమిటో రాయ లసీమ నాయకులు సమాధానం చెప్పాలి. 1983లో ప్రారంభ మైన తెలుగుగంగా పథకం ద్వారా చెన్నై నగరానికి ఐదు టిఎం సిలు (ఆంధ్రద్రేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలకు వాటాప్రకారం) 3.21 లక్షల ఎకరాలకు రాయలసీమలోని పంటలకు సాగునీరు కల్పించాలని ఉద్దేశించారు. తెలుగుగంగా కాలువ శ్రీశైలం జలా శయం నుండి 29, కృష్ణానది నికర జలాల నుండి 15 టిఎం సిలను తీసుకుంటుంది.ఈ కాలువ పొడవు 408కి.మీగా ఉంది.
1989లో ప్రారంభమైన హంద్రి -నీవా పథకం ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. శ్రీశైలం జలాశయం ఉపరితల భాగం లో కర్నూలు జిల్లాలోని మాల్యాల గ్రామం వద్ద ప్రధాన కాలు వగా ప్రారంభమై 740 కి.మీ ప్రవహించి చిత్తూరు జిల్లాలోని నీవా నదిలో కలుస్తుంది. శ్రీశైలం రిజర్వాయరులోని వరదనీటి నుండి 40 టిఎంసిలను కేటాయించారు. దీనిద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనా వేసారు. 19 89లో ప్రారంభించిన మరో పథకం గాలేరు -నగరి సుజల స్రవంతి. శ్రీశైలం రిజర్వాయరు నుంచి 38 టిఎంసిల వరదనీరు కేటాయింరు.  మొదట్లో 18 బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లకు రూప కల్పన చేసి, తర్వాత 8కే కుదించారు. గోరుకల్లు వద్ద ప్రారం భమై నగరి వద్ద కుశస్థలి నదిలో కలుస్తుంది. అలాగే శ్రీశైలం రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతంలో నందికొట్కూరు దగ్గరలోని పోతిరెడ్డిపాడు అనే గ్రామం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నిర్మాణం జరిగింది. దీన్నుండే తెలుగు గంగా, గాలేరు -నగరి, హంద్రి - నీవాల నుండి రాయలసీమకు కేటాయించిన 102 టిఎంసిలు రావాల్సిఉంది. దీని నిర్మాణం 11,500 క్యూసెక్కు లుగా నిర్ధారించారు. అన్ని పథకాలకు శ్రీశైలం రిజర్వాయర్‌ నుండే నీటిని తీసుకురావాల్సి ఉన్నందువల్ల పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచాల్సి ఉంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ అడుగుభాగం మట్టం 841 అడుగులు. శ్రీశైలం రిజర్వాయర్‌ నిండితే, లెవల్‌ 885 అడుగులు. నిజానికి కనీస ట్రేడౌన్‌ లెవల్‌ 834 అడుగులు ఉండాలని జి.వో 69 చెప్తుంది. రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచడానికి కోస్తా,తెలంగాణ నాయ కులు ఒప్పుకోవడంలేదు. తెలంగాణ విడిపోతున్న చారిత్రక సందర్భంలో సమైక్య రాష్ట్రంలో మన నీటి వాటాను కోల్పోయిన నేపథ్యంలో రాయలసీమ నీటి వాటా గురించి కచ్చితంగా అడ గాల్సిన అవసరం రాయలసీమ ప్రజలకు ఎంతైనా ఉంది.
Vaartha daily 17-09-2013

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...