Monday, December 9, 2013

కె.సభా కంటే ముందే చిత్తూరు జిల్లా నుంచి గొప్ప కథా సాహిత్య రచన

' సూర్య ' అక్షరం పేజీలో 2013 నవంబర్‌ 11 న చిత్తూరు జిల్లా కథానిక పేరుతో శిబ్బాల ప్రకాష్‌ చిత్తూరు జిల్లా కథ ప్రారంభ, కొనసాగింపు, చరిత్ర వివరించే వ్యాసం రాశారు. ఆయన తన వ్యాసంలో కథానిక నిర్వచనం, ప్రాచీన, ఆధునిక సాహిత్యాల మధ్య కథానిక స్వరూపం కథానిక ఆవిర్భావం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. బాగుంది. కానీ, రాయలసీమ కథాచరిత్రను గురించి చెప్పకుండా ఉండడం కొంత వెలితిగా అనిపించింది. ఒక్క రాయలసీమలోనే గాక ఆంధ్రదేశంలోనే చిత్తూరు జిల్లాది ఒక ప్రత్యేక స్థానం. భౌగోళికంగా, రాజకీయ చిత్ర పటంలో, భాషలో వైవిద్యం కలిగి ఉంది. ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథానిక, నవల, విమర్శలలో తనదైన గుర్తింపు పొందిన జిల్లా చిత్తూరు.

చిత్తూరు జిల్లా కథానిక గురించి మాట్లాడితే- తెలుగు కథా సాహిత్యంలో గొప్ప కథకులుగా చెప్పుకోదగిన కొందరు కథకులు ఈ జిల్లాకు చెందినవారే. వారిలో కె. సభా, మధురాంతకం రాజారాం, ఆర్‌.ఎస్‌. సుదర్శనం, పులికంటి క్రిష్ణారెడ్డి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య వంటివారు ఉన్నారు. అయితే, రాయలసీమ కథా ప్రారంభం కె. సభాతో జరిగిందని విమర్శకుల అభిప్రాయం. ఈ ప్రభావం వలననే ప్రకాష్‌ కూడా కె. సభానే చిత్తూరు జిల్లా ప్రారంభ కథకులుగా పేర్కొన్నారు. ఇదే పత్రికలో (సూర్య- అక్షరం) 2012 డిసెంబర్‌ 31న ‘తొలి రాయల సీమ కథ’ పేరుతో రాయలసీమ కథాసాహిత్యం గురించి వ్యాసం వచ్చింది. రాయలసీమలో కె. సభాకంటే ముందు- చిత్తూరు జిల్లా నుంచి గొప్ప కథా సాహిత్య రచన జరిగింది. ఆ కథకులలో ఎమ్‌.వి. పాపన్న గుప్త, చింతా నరసింహా రెడ్డి, టి.కె. రంగస్వామి అయ్యంగార్‌, మామిడి రుక్మిణమ్మ, పూతలపట్టు శ్రీరాములరెడ్డి లను పేర్కొనవచ్చు.

ఈ కథకులు చిత్తూరు జిల్లా తొలి కథకుడుగా చెప్పుకుంటున్న కె. సభా కంటే ముందే ఆదర్శవంతమైన కథావస్తువులతో కథలు రాశారు. పైన పేర్కొన్న కథకులందరూ భారత కథానిధి మాసపత్రికలో 1927 లోనే కథారచన సాగించారు. చిత్తూరు జిల్లా తొలి కథ ‘శారద’ కథకుడు యమ్‌. వి.పాపన్న గుప్త- 1927 జనవరి, హైమావతి 1928, మలి కథలు- ‘సుందరి’ మామిడి రక్మిణమ్మ- 1927జనవరి; ‘ప్రేమానుబంధం’ చింతా నరసింహారెడ్డి-1927 జూలై; ‘ఒక ఆది ఆంధ్రుని జీవిత చరిత్ర’ పూతల పట్టు శ్రీరాములరెడ్డి- 1928 డిశెంబర్‌; ‘నా చిట్టి తల్లి’ టి.కె. రంగస్వామి అయ్యంగార్‌-1929 నవంబర్‌. ఈ కథలన్నీ 1926లో ప్రొద్దుటూరు నుండి వెలువడిన భారత కథానిధి పత్రికలో ముద్రితమైనవే. వీరిలో కొందరు కథకులనే విషయం సాహిత్య ప్రపంచానికి ఇంతవరకూ తెలియక పోవడం మన దురదృష్టం. వీరు కాక విద్వాన్‌ నెత్తం నరసింహులు కూడా హాస్య కథావళి పేరుతో 1965లో హాస్య కథలు రాశారు. ఆయన తప్ప తక్కిన పై వారందరూ కె. సభాకంటే ముందే చిత్తూరు జిల్లా కథా సాహిత్యానికి కృషిచేసినవారే. పై వారు రాసిన కథలను ఒకటి రెండింటిని పరిశీలిస్తే- 1927ప్రాంతంలోనే చిత్తూరు జిల్లాలో ఎంతటి ఆదర్శమైన కథాసాహిత్యం వెలువడిందో అర్ధమవుతుంది.

ఎమ్‌.వి. పాపన్న గుప్త రాసిన ‘శారద’ కథలో మూఢనమ్మకాలతో కూడిన సంప్రదాయాలు ప్రసాద రావు ప్రాణాలు ఎలా బలితీసున్నాయో తెలుపుతుంది. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన శారదకు తల్లి కాంత లక్షుమ్మ ప్రసాదరావు కొడుకు క్రిష్ణారావుతో పెళ్ళిచేస్తుంది.ప్రసాదరావు పూర్వాచార పరాయణుడు. చెడ్డ నక్షత్రంలో కోడలిని కాపురానికి తెచ్చుకో కూడదని- కొడుకు కోడలు కలిసి ఉండకూడదని ఆక్షేపిస్తాడు. క్రిష్ణారావు బి.ఎ. చదువుకున్నాడు. తహశీల్దార్‌ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ నిర్వహణలో వేరే ఊరులో ఉంటాడు. పెళ్ళై రెండు సంవత్సరాలైంది. తండ్రి మాట ప్రకారం భార్యను తెచ్చుకోలేదు. తండ్రికి చెప్పకుండా ఓరోజు అత్తగారింటికి పోతాడు. తాను పూర్వాచారముల మన్నించువాడను కాదని వెంటనే తన వెంట శారదాను పంపవలయును- అని తన అత్తగారితో చెప్పి భార్యను తెచ్చుకొని కాపురం చేస్తుంటాడు.

ఈ విషయం తెలిసిన తండ్రి ప్రసాదరావు తన మాట వినకుండా శారదను తెచ్చుకున్నందుకు కోపంతో- ‘ఇక నీ గతి నీది, నా గతి నాది, లోక నింద పడజాలను గాన నేను పాషానణము గొని ఈ లోకంను బాయుచున్నాను’ అని ఉత్తరం రాసి ఆత్మహ త్య చేసుకుంటాడు. ఎందుకూ పనికిరాని సంప్రదాయాలకు, సమాజాన్ని వెనక్కు తీసుకుపోయే వారికి ప్రసాదరావు ప్రతినిధి. మూఢనమ్మకాలను విస్మరించి సమాజాన్ని ముందుకు తీసుకుపోయేవారికి ప్రతినిధి క్రిష్ణారావు. భారత దేశంలో బాల వితంతువుల సమస్యకు బాల్య వివాహాలే కారణం అనే విషయం చర్చగా సాగే కథ టి.కె. రంగస్వామి అయ్యంగార్‌ రాసిన ‘నా చిట్టి తల్లి’. ‘బ్రాహ్మణులలో కోమటి వారలలో ఉన్నంత మంది చిన్న వయసులోని ముండ మోపులు కాపువారిలో లేరు. ఇందుకు కారణము చిన్నతనపు పెళ్ళిళ్ళే. అందుకే శారద బిల్లు. అది ఇప్పుడు చట్టమైంది. ఇం మనకు బాగుం డును- అని సుందరి ఒక సన్యాసితో చెపుతుంది.

సుందరి ఆ సన్యాసే తన తండ్రి అని తెలుసు కుంటుంది. వితంతువైన సుందరి- అందుకు కారణం, తాను చిన్ననాడే పెళ్ళి చేసుకోవడంగా తండ్రికి చెబుతుంది.తరువాత తండ్రి కూతుర్లు ఒకరినొకరు తెలుసుకుంటారు. 1928-1929 మధ్య వచ్చిన శారదా చట్టం చిత్తూరు జిల్లా కథకులపైన ప్రభావం చూపిందనడానికి ఈ కథ సాక్ష్యం.చింతా నరసింహారెడ్డి 1927లో రాసిన ప్రేమానుబంధంలో ఆర్థిక సంబంధాలు మనుషులను ఎలా దూరం చేస్తాయో తెలుపుతుంది. ఒక అమాయకుడైన దళితుని కథ పూతల పట్టు శ్రీరాముల రెడ్డి రాసిన- ఒక ఆది ఆంధ్రుని జీవిత చరిత్ర. తరువాత మరో చరయిత్రి మామిడి రుక్మిణమ్మ రాసిన- సుందరి- కథ. ఈ కథలన్నీ 1944లో కథారచన ప్రారంభించిన కె. సభా కంటే ముందే జరిగిన కథా రచనలు. కాలక్రమంగా పరిశీలిస్తే ఆధారాలు లభిస్తున్నంత వరకూ ఎమ్‌.వి. పాపన్న గుప్తా చిత్తూరు జిల్లా తొలి కథకుడుగా, శారద కథ చిత్తూరు జిల్లా తొలి కథగా గుర్తించవలసి ఉంది.
-తవ్వా వెంకటయ్య 
December 9, 2013, Andhrajyothy daily "vividha".

Tuesday, December 3, 2013

రాయలసీమకు ఎన్నాళ్లీ గులాంగిరీ? - కె. రాహుల్ సిద్ధార్థ

దాదాపు ఆరు దశాబ్దాలు (1953 నుంచి 2013) దాకా కోస్తాంధ్రవాసుల సాహచర్యంలో ఉన్నాం. అయితే సీమకు మిగిలింది ఏమిటి? ఒరిగింది ఏమిటి? దేశంలోనే అత్యంత దుర్భిక్షంలో ఉండే కరువు ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోయింది. దేశంలోనే అత్యంత కరువుబారిన పడిన జిల్లాల్లో అనంతపురానిదే అగ్రస్థానమని 90 దశకంలోనే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నివేదించిన సంగతి అక్షర సత్యం. మరో పాతికేళ్లలో అనంతపురం పూర్తిస్థాయి ఎడారిగా మారిపోతుందని జలవనరుల నిపుణులు ఏకరువు పెట్టిన మాట వాస్తవం కాదా? కడప, కర్నూలు జిల్లాల పరిస్థితి కూడా దీనికి దరిదాపుల్లోనే ఉంది. రుతుపవనాల వల్ల లభించే వర్షపాతం రాయలసీమలో సాధారణ సగటుకన్నా అత్యల్పంగా ఉంది. ప్రాంత రైతు దుస్థితి రుతుపవనాలలో జూదమాడిన చందంగా ఉంది. తాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితి దాపురించింది. కృష్ణా-పెన్నా ప్రాజెక్టును ఆటకెక్కించారు. సీమ దుస్థితిని చూపి నీటివాటా పొంది రాయలసీమకు మొండిచెయ్యి చూపి కోస్తాంధ్రకు నీటిని తరలించారు. సీమ ప్రాంత సమస్యలు ఏకరువు పెట్టేందుకు నేతలు ఏనాడూ ప్రయత్నించలేదు. సీమలో భారీ పరిశ్రమలు లేవు. విస్తృత రైలు మార్గాలు లేవు. ఉపాధి అవకాశాలు మృగ్యం. రాయలసీమ నుంచి ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఆరుగురు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ప్రాంతానికి ఒరిగింది మాత్రం శూన్యం. సమైక్య రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది రాయలసీమ ప్రాంతమే.
తెలుగువారంతా కలిసి ఉండాలనే విశాలాంధ్ర భావన మొగ్గతొడిగి 2013తో వందేళ్లు పూర్తి చేసుకొంది. యాదృచ్ఛికంగా సరిగ్గా వందేళ్లకు 2013లోనే తెలుగు నేల ముక్కలు చెక్కలయింది. సమైక్య రాష్ట్రం విచ్ఛిన్నమైంది. తెలుగుగడ్డ రెండు ముక్కలయింది. ఇంతటి కీలకదశలో రాయలసీమ దశ-దిశ ప్రస్తావన లేకుండా చేశారు. తెలంగాణ, సీమాంధ్ర అంటూ రాష్ట్రంలో రెండే ప్రాంతాలున్నట్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాయలసీమ అస్తిత్వాన్ని మరుగునపడేశారు. సీమ వేరు, కోస్తాంధ్ర వేరు అనే వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు గుర్తించాల్సి ఉంది. ఒక ప్రాంత ప్రజలను సంతృప్తి పరచేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. మరో ప్రాంతానికి పోలవరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ జాతీయ హోదాతో నిధులు గుమ్మరించి సర్దుబాటు చేశారు. మరి రాయలసీమ పరిస్థితి ఏమిటి? ఓట్లు-సీట్లు పరమావధిగా మారిన నేటి కుటిల రాజనీతి సిద్ధాంతంలో రాయలసీమ పట్ల ఎందుకీ వివక్ష? 52 శాసనసభ స్థానాలు, 8 పార్లమెంటు నియోజకవర్గాలు, 1.5 కోట్ల జనాభా కలిగిన ప్రాంతమంటే ఎందుకింత చిన్నచూపు?
రాయలసీమ సామాజిక జీవన విధానం తెలియని మూర్ఖపు నేతలు చేస్తున్న వితండవాదనే తాజాగా తెరమీదకు వచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదన. రాయలసీమ అస్తిత్వాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు పన్నిన కుట్ర ఇది. తమ స్వీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్న నేతల స్వార్థపూరిత యోచనకు ఇది నిదర్శనం. 1948 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణ ఒక ప్రత్యేక రాజ్యం. కాగా రాయలసీమ బ్రిటిష్ ఇండియాలో ఒక భాగం. ఏనాడూ పొంతనలేని రెండింటినీ విధంగా కలుపుతారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల జీవన విధానాలు పూర్తి భిన్నమైనవి. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపితే సీమ ఉనికి శాశ్వతంగా కనుమరుగవుతుంది. సీమలో ప్రస్తుతమున్న నాలుగు జిల్లాలు వేరుచేయడానికి వీలులేని పరస్పర అంగాలని చెప్పవచ్చు. మత ప్రాతిపదికన ఓట్లు కొల్లగొట్టాలని రాజకీయపక్షం స్వార్థపూరిత డిమాండ్ను ముందుకు తెస్తోంది. మతం ఒక్కటే అయినా... భాష వేరనే కారణంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్లు వేరు కాలేదా? ప్రాంతాల ఏకీకరణకు మతం ఎన్నడూ ప్రాతిపదిక కారాదు. ఒకవేళ మతమే ప్రాతిపదిక అయితే అది దేశ సమైక్యతకు భంగం కలిగిస్తుంది. వేర్పాటువాదానికి ఊతమిస్తుంది. రాజకీయ నేతల అవతారమెత్తిన పవర్ బ్రోకర్లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు రాయల తెలంగాణ అంటూ పల్లవిస్తుండడం సిగ్గుపడాల్సిన విషయం.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక ఉందని సాక్షాత్తు ఇందిరాగాంధీ లోక్సభలో పేర్కొన్నారు. అయినప్పటికీ విభజించు-పాలించు సూత్రాన్ని అవలంబించాలని నేటి సోనియాగాంధీ కాంగ్రెస్ తలపోస్తే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే సరి? రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడమే ప్రస్తుతం అత్యంత అవశ్యకం. నాడు శ్రీబాగ్ ఒడంబడికను నిస్సిగ్గుగా ఉల్లంఘించిన కోస్తాంధ్రతో విధంగా కలిసి ఉండమని ఉపదేశిస్తారు? ఇప్పుడు కూడా గుంటూరు, విజయవాడ, ఒంగోలు, విశాఖపట్నాలను రాజధాని చేయాలని తాపత్రయపడుతున్నారా లేదా? నాటి రాజధాని కర్నూలును లేదా మరో రాయలసీమ జిల్లాను రాజధానిగా చేయాలని పెద్దన్నగా ఎందుకు ఆలోచించరు? ప్రతిపాదిత రాయలసీమ రాష్ట్రం ఏర్పడితే 8 ఈశాన్య రాష్ట్రాల కన్నా, గోవా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ కన్నా పెద్ద రాష్ట్రమవుతుంది. 1970లో కర్నూలు జిల్లా నుంచి కొంత భూభాగాన్ని వేరుచేసి ప్రకాశం జిల్లాలో కలిపారు. దాన్ని తిరిగి కర్నూలు జిల్లాలో కలపాల్సి ఉంటుంది. నాడు కోల్పోయిన బళ్లారిని మళ్లీ రాయలసీమలో కలపాల్సి ఉంది. దీనికోసం మరో ఎస్సార్సీ కానీ, ప్రత్యేక కమిషన్ వేసినా ఫర్వాలేదు. ప్రత్యేక రాష్ట్రంగా రాయలసీమ మనగలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని నిర్దిష్ట కాలపరిమితి వరకు మూడు ప్రాంతాలకు పంపిణీ చేయండి. ఈలోగా సీమ స్వావలంబన సాధించేందుకు అవకాశం ఉంది. తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, లేపాక్షి, అహోబిలం, యాగంటి, కడపదర్గా, వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతమిది.
ఆధ్యాత్మిక పర్యాటకంతో సీమ స్వయం సమృద్ధి సాధిస్తుంది. సీమలో అపార ఖనిజ సంపద ఉంది. ప్రాంత స్వావలంబనకు నిక్షేపాలు ఇతోధికంగా తోడ్పడతాయి. రాయలసీమ నాడు బళ్లారిని కోల్పోయింది. రాజధాని ఉన్న మద్రాసు, కర్నూలును కోల్పోయింది. నేడు హైదరాబాద్ కూడా పరాయిదయిపోయింది. ఇకనైనా రాయలసీమ ప్రజలు జాగరూకత ప్రదర్శించాల్సి ఉంది. లేకపోతే మరోసారి బానిసత్వపు సంకెళ్లలో చిక్కుకొని బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో వలసజీవులుగా దుర్భర జీవనాన్ని భవిష్యత్ తరాలు అనుభవించాల్సి ఉంటుంది. సీమలో తరతరాలుగా అనుభవిస్తున్న గులాంగిరీకి చెల్లుచీటి రాయాల్సిన సరైన తరుణం ఇదే. - కె. రాహుల్ సిద్ధార్థ
ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జనచేతన
Andhra Jyothy 03-12-2013.
దాదాపు ఆరు దశాబ్దాలు (1953 నుంచి 2013) దాకా కోస్తాంధ్రవాసుల సాహచర్యంలో ఉన్నాం. అయితే సీమకు మిగిలింది ఏమిటి? ఒరిగింది ఏమిటి? దేశంలోనే అత్యంత దుర్భిక్షంలో ఉండే కరువు ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోయింది. దేశంలోనే అత్యంత కరువుబారిన పడిన జిల్లాల్లో అనంతపురానిదే అగ్రస్థానమని 90వ దశకంలోనే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నివేదించిన సంగతి అక్షర సత్యం. మరో పాతికేళ్లలో అనంతపురం పూర్తిస్థాయి ఎడారిగా మారిపోతుందని జలవనరుల నిపుణులు ఏకరువు పెట్టిన మాట వాస్తవం కాదా? కడప, కర్నూలు జిల్లాల పరిస్థితి కూడా దీనికి దరిదాపుల్లోనే ఉంది. రుతుపవనాల వల్ల లభించే వర్షపాతం రాయలసీమలో సాధారణ సగటుకన్నా అత్యల్పంగా ఉంది. ఈ ప్రాంత రైతు దుస్థితి రుతుపవనాలలో జూదమాడిన చందంగా ఉంది. తాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితి దాపురించింది. కృష్ణా-పెన్నా ప్రాజెక్టును ఆటకెక్కించారు. సీమ దుస్థితిని చూపి నీటివాటా పొంది రాయలసీమకు మొండిచెయ్యి చూపి కోస్తాంధ్రకు నీటిని తరలించారు. సీమ ప్రాంత సమస్యలు ఏకరువు పెట్టేందుకు నేతలు ఏనాడూ ప్రయత్నించలేదు. సీమలో భారీ పరిశ్రమలు లేవు. విస్తృత రైలు మార్గాలు లేవు. ఉపాధి అవకాశాలు మృగ్యం. రాయలసీమ నుంచి ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఆరుగురు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఈ ప్రాంతానికి ఒరిగింది మాత్రం శూన్యం. సమైక్య రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది రాయలసీమ ప్రాంతమే.
తెలుగువారంతా కలిసి ఉండాలనే విశాలాంధ్ర భావన మొగ్గతొడిగి 2013తో వందేళ్లు పూర్తి చేసుకొంది. యాదృచ్ఛికంగా సరిగ్గా వందేళ్లకు 2013లోనే తెలుగు నేల ముక్కలు చెక్కలయింది. సమైక్య రాష్ట్రం విచ్ఛిన్నమైంది. తెలుగుగడ్డ రెండు ముక్కలయింది. ఇంతటి కీలకదశలో రాయలసీమ దశ-దిశ ప్రస్తావన లేకుండా చేశారు. తెలంగాణ, సీమాంధ్ర అంటూ రాష్ట్రంలో రెండే ప్రాంతాలున్నట్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాయలసీమ అస్తిత్వాన్ని మరుగునపడేశారు. సీమ వేరు, కోస్తాంధ్ర వేరు అనే వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు గుర్తించాల్సి ఉంది. ఒక ప్రాంత ప్రజలను సంతృప్తి పరచేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. మరో ప్రాంతానికి పోలవరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ జాతీయ హోదాతో నిధులు గుమ్మరించి సర్దుబాటు చేశారు. మరి రాయలసీమ పరిస్థితి ఏమిటి? ఓట్లు-సీట్లు పరమావధిగా మారిన నేటి కుటిల రాజనీతి సిద్ధాంతంలో రాయలసీమ పట్ల ఎందుకీ వివక్ష? 52 శాసనసభ స్థానాలు, 8 పార్లమెంటు నియోజకవర్గాలు, 1.5 కోట్ల జనాభా కలిగిన ఈ ప్రాంతమంటే ఎందుకింత చిన్నచూపు?
రాయలసీమ సామాజిక జీవన విధానం తెలియని మూర్ఖపు నేతలు చేస్తున్న వితండవాదనే తాజాగా తెరమీదకు వచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదన. రాయలసీమ అస్తిత్వాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు పన్నిన కుట్ర ఇది. తమ స్వీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్న నేతల స్వార్థపూరిత యోచనకు ఇది నిదర్శనం. 1948 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణ ఒక ప్రత్యేక రాజ్యం. కాగా రాయలసీమ బ్రిటిష్ ఇండియాలో ఒక భాగం. ఏనాడూ పొంతనలేని ఈ రెండింటినీ ఏ విధంగా కలుపుతారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల జీవన విధానాలు పూర్తి భిన్నమైనవి. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపితే సీమ ఉనికి శాశ్వతంగా కనుమరుగవుతుంది. సీమలో ప్రస్తుతమున్న నాలుగు జిల్లాలు వేరుచేయడానికి వీలులేని పరస్పర అంగాలని చెప్పవచ్చు. మత ప్రాతిపదికన ఓట్లు కొల్లగొట్టాలని ఓ రాజకీయపక్షం ఈ స్వార్థపూరిత డిమాండ్‌ను ముందుకు తెస్తోంది. మతం ఒక్కటే అయినా... భాష వేరనే కారణంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు వేరు కాలేదా? ప్రాంతాల ఏకీకరణకు మతం ఎన్నడూ ప్రాతిపదిక కారాదు. ఒకవేళ మతమే ప్రాతిపదిక అయితే అది దేశ సమైక్యతకు భంగం కలిగిస్తుంది. వేర్పాటువాదానికి ఊతమిస్తుంది. రాజకీయ నేతల అవతారమెత్తిన పవర్ బ్రోకర్లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు రాయల తెలంగాణ అంటూ పల్లవిస్తుండడం సిగ్గుపడాల్సిన విషయం.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక ఉందని సాక్షాత్తు ఇందిరాగాంధీ లోక్‌సభలో పేర్కొన్నారు. అయినప్పటికీ విభజించు-పాలించు సూత్రాన్ని అవలంబించాలని నేటి సోనియాగాంధీ కాంగ్రెస్ తలపోస్తే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే సరి? రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడమే ప్రస్తుతం అత్యంత అవశ్యకం. నాడు శ్రీబాగ్ ఒడంబడికను నిస్సిగ్గుగా ఉల్లంఘించిన కోస్తాంధ్రతో ఏ విధంగా కలిసి ఉండమని ఉపదేశిస్తారు? ఇప్పుడు కూడా గుంటూరు, విజయవాడ, ఒంగోలు, విశాఖపట్నాలను రాజధాని చేయాలని తాపత్రయపడుతున్నారా లేదా? నాటి రాజధాని కర్నూలును లేదా మరో రాయలసీమ జిల్లాను రాజధానిగా చేయాలని పెద్దన్నగా ఎందుకు ఆలోచించరు? ప్రతిపాదిత రాయలసీమ రాష్ట్రం ఏర్పడితే 8 ఈశాన్య రాష్ట్రాల కన్నా, గోవా, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల కన్నా పెద్ద రాష్ట్రమవుతుంది. 1970లో కర్నూలు జిల్లా నుంచి కొంత భూభాగాన్ని వేరుచేసి ప్రకాశం జిల్లాలో కలిపారు. దాన్ని తిరిగి కర్నూలు జిల్లాలో కలపాల్సి ఉంటుంది. నాడు కోల్పోయిన బళ్లారిని మళ్లీ రాయలసీమలో కలపాల్సి ఉంది. దీనికోసం మరో ఎస్సార్సీ కానీ, ప్రత్యేక కమిషన్ వేసినా ఫర్వాలేదు. ప్రత్యేక రాష్ట్రంగా రాయలసీమ మనగలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని నిర్దిష్ట కాలపరిమితి వరకు మూడు ప్రాంతాలకు పంపిణీ చేయండి. ఈలోగా సీమ స్వావలంబన సాధించేందుకు అవకాశం ఉంది. తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, లేపాక్షి, అహోబిలం, యాగంటి, కడపదర్గా, వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతమిది.
ఆధ్యాత్మిక పర్యాటకంతో సీమ స్వయం సమృద్ధి సాధిస్తుంది. సీమలో అపార ఖనిజ సంపద ఉంది. ఈ ప్రాంత స్వావలంబనకు ఈ నిక్షేపాలు ఇతోధికంగా తోడ్పడతాయి. రాయలసీమ నాడు బళ్లారిని కోల్పోయింది. రాజధాని ఉన్న మద్రాసు, కర్నూలును కోల్పోయింది. నేడు హైదరాబాద్ కూడా పరాయిదయిపోయింది. ఇకనైనా రాయలసీమ ప్రజలు జాగరూకత ప్రదర్శించాల్సి ఉంది. లేకపోతే మరోసారి బానిసత్వపు సంకెళ్లలో చిక్కుకొని బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో వలసజీవులుగా దుర్భర జీవనాన్ని భవిష్యత్ తరాలు అనుభవించాల్సి ఉంటుంది. సీమలో తరతరాలుగా అనుభవిస్తున్న గులాంగిరీకి చెల్లుచీటి రాయాల్సిన సరైన తరుణం ఇదే.
- కె. రాహుల్ సిద్ధార్థ
ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జనచేతన

- See more at: http://www.andhrajyothy.com/node/35484#sthash.siMfRpQe.dpuf

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...