కడప, ఆగస్టు 4: రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ
తీర్మానం తర్వాత
 |
శ్రీరామి రెడ్డి |
దేశంలో 14 ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రాల కోసం
ఉద్యమించి కేంద్రంపై ఒత్తిడి తెలుస్తున్నారు. ఇదే సీమ ప్రజలకు సరైన సమయం.
దేశంలోని ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్,
హర్యానా, గోవా, మిజోరాం, త్రిపుర తదితర రాష్ట్రాల కంటే రాయలసీమ అన్ని విధాల
పెద్దది. కావున ప్రస్తుత ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంతోపాటు రాయలసీమ
రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేసి దానిని
సాధించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటి పారుదల శాఖ మాజీ సలహాదారు, రాయలసీమ అభ్యుదయ సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రజలు ఆరు శతాబ్దాల చరిత్రలో అతి విషమ ఘట్టంలో
ఉన్నారని, సీమ ప్రజల మనోభావాలు, హృదయఘోష ఏ పార్టీలకు పట్టడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం
విలేకరుల సమావేశంలో శ్రీరామిరెడ్డి మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్య వైభవ
పతనం తర్వాత పాలకుల నిర్లక్ష్యం, నిరాధరణ మూలంగా సీమ ప్రజలు దారిద్య్రాన్ని
అనుభవిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం రాయలసీమను విభజించి ఒక
ప్రాంతాన్ని తెలంగాణలో, మరొకటి ఆంధ్రలో కలపాలనుకోవడం శతాబ్దాల భౌగోళిక,
చారిత్రక, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అస్థిత్వవాన్ని రూపు మాపి శాశ్వతంగా
నామరూపాలు లేకుండా భూస్థాపితం చేయడమేనన్నారు. 2014లో జరగబోయే ఎన్నికలలో
అధిక సీట్లు సంపాధించాలన్న దురాశతో ఈ విధంగా చేస్తున్నారన్నారు. రాయలసీమ
ప్రజలు రాజ్యాంగ పరంగా, రాజకీయ పరంగా చైతన్యవంతులైతే తప్ప వారికి రాజకీయ,
రాజ్యాంగ భద్రత, జీవిత ప్రమాణాలు పెంపొందించుట తగు విధాన కార్యాచరణ
జరుగుతుందని నమ్మలేమన్నారు. నీరు, విద్యుచ ్ఛక్తి, పరిశ్రమలు, ఉద్యోగాలు
తదితర విషయాలలో సీమకు నాటినుంచి నేటి వరకు అన్యాయం జరుగుతుందన్నారు.
తెలంగాణ వారికి రాష్ట్రం, కోస్తాకు పోలవరం ప్రాజెక్టు , కానీ రాయలసీమకు
మొండిచెయ్యి చూపిస్తున్నారన్నారు. 18 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న
గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల గురించి ఒక్క మాట
మాట్లాడలేదన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమకు కొంత నికర జలాలు
వస్తాయనుకోవడం భ్రమేనన్నారు. విద్యుచ్ఛక్తి విషయంలో రాయలసీమ థర్మల్ పవర్
ప్రాజెక్టు తప్ప మరే ప్రాజెక్టు సీమలో లేవన్నారు. దేశంలోనే అపారంగా ఖనిజ
సంపద ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఇంతవరకు ఏ ఒక్క భారీ
పరిశ్రమను స్థాపించలేదన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్లో
రాయలసీమ ఎక్కువ వెనుకబడిన ప్రాంతమని చెప్పినప్పటికీ ప్రభుత్వాలు
స్పందించలేదన్నారు. రాయలసీమ
ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమంలో అం కిత భావంతో పాల్గొంటున్నారని అయితే ఉద్యమ
ఫలితం ఎలా ఉంటుందో తెలియదన్నారు. కేంద్రం హైదరాబాద్ సమస్యను సంతృప్తికరంగా
పరిష్కరిస్తే కోస్తా ప్రజలు ఉద్యమాన్ని విరమించవచ్చన్నారు. అప్పుడు సీమ
ప్రజలను కోస్తాంధ్రతో ఉంచుతారా? లేక రెండుగా చీల్చి తెలంగాణ, ఆంధ్రలో
కలుపుతారా? రెండుగా చీల్చితే సీమ ఉనికే నాశనమవుతుందన్నారు.
hi, check this website: http://manarayalaseema.hpage.com
ReplyDelete