Saturday, June 1, 2013

అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట....


సాక్షి 01-06-2013 
ఈనాడు 01-06-2013
కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యంత విలువైన వజ్రాల ముడిపదార్థాల(కింబర్ లైట్లు) నిక్షేపాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2012 లో గుర్తించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రము, ఉరవకొండ మండలం లత్తవరం, లత్తవరం తండా, వజ్రకరూరు మండలం పరిధిలోని పామిడి రోడ్డు సమీపంలో కింబర్ లైట్లను జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. బెంగళూరులో ఇటీవల జరిగిన 10వ అంతర్జాతీయ వజ్రానే్వషణ సదస్సుకు హజరైన దక్షిణాఫ్రికా శాస్తవ్రేత్తలు, జియాలజిస్టులతో కూడిన 30 మంది సభ్యుల బృందం బుధవారం వజ్రకరూరు మండల పరిధిలో గుర్తించిన పైపు-1, పైపు-2, లత్తవరం సమీపంలోని పైపు-3, పైపు-4 లను పరిశీలించింది. దీంతోపాటు ఉరవకొండ మండల పరిధిలోని లత్తవరం, లత్తవరం తండాల సమీపంలో కింబర్‌లైట్లను సైతం ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బృందంలోని ఓ శాస్తవ్రేత్త మాట్లాడుతూ సర్వేలో రాయలసీమ జిల్లాల్లోని 50 కింబర్‌లైట్లను గుర్తించినట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలోని లత్తవరం, లత్తవరం తండా పరిసర ప్రాంతాల్లోని కింబర్లకు సంబంధించిన 3400 మెట్రిక్ టన్నుల మట్టిని సేకరించి వజ్రకరూరులోని వజ్రానే్వషణ కేంద్రం పరిశీలించామన్నారు. దీంట్లో దాదాపు 12 వజ్రాలు లభ్యమైనట్లు తెలిపారు. కళ్యాణదుర్గం సమీపంలోని తిమ్మసముద్రం వద్ద అత్యంత విలువైన వజ్ర నిక్షేపాల కింబర్ లైట్లను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
అంగళ్ళ రతనాలు అమ్మినారట అచట..... అంటూ ఆంధ్రదేశ సౌభాగ్య సంపద గురించి ఘంటసాల గొంతునుంచి జాలువారే పాటవిని పులకరించను తెలుగువారు వుండరు. ఇది కేవలం కవి కల్పితం కాదు అక్షర సత్యం అంటున్నారు జియాలజిస్టులు. భారతదేశానికి ఘనకీర్తి తెచ్చిపెట్టిన అద్భుతమైన వజ్రాలన్నీ  రాయలసీమ గనుల నుంచి వెలికితీసినవే అని పరిశోధకులు ఘంటాపధంగా చెబుతున్నారు. గోల్కొండ రాజ్యంలో భాగమైన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా గనుల నుంచి పలు ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలను తవ్వితీశారు. ప్రపంచ ఖ్యాతి గాంచిన కోహినూర్‌ వజ్రం, గ్రేట్‌ మొఘల్‌, పిట్‌, ఓర్లాఫ్‌, హోప్‌, నిజామ్‌, అక్బర్‌ షా, దరియా - ఎ - నూర్‌ తదితర వజ్రాలను ఈ గనుల నుంచే వెలికితీశారని పరిశోధకులు చెబుతున్నారు. 16 నుంచి 19వ శతాబ్దం వరకు జరిపిన తవ్వకాల్లో ఈ అమూల్యమైన వజ్రాలు బయటపడ్డాయి. అయితే అత్యంత విలువైన ఈ వజ్రాలన్నీ ఇప్పుడు పరుల సొమ్ము అయ్యాయి. కోహినూరు వజ్రం బ్రిటన్‌ రాణి కిరీటంలో చేరింది. మొఘల్‌ వజ్రం జాడే తెలియడం లేదు. పిట్‌ వజ్రం పారిస్‌ లోని అపోలో గ్యాలరీలో వుంది. ఓర్లాఫ్‌ రష్యాలో, హోప్‌ అమెరికాలో వున్నాయి. అమూల్యమైన భారతీయ వజ్రసంపద ఇలా పరాయి దేశాలపాలు కావడం నిజంగా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్‌ లోని ఈ నాలుగు జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్‌ లోని పన్నా ప్రాంతం అమూల్యమైన వజ్రాలకు నిలయంగా వున్నదని పరిశోధకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో కొల్లూరు, గొల్లపల్లి, బనగానపల్లి తదితర గ్రామాల్లో వజ్రాల గనులుండేవని ప్రతీతి. దశాబ్దాల కాలంగా వజ్రాలవేటను నిలిపివేసిన ప్రభుత్వం ఇటీవలే మళ్ళీ ఆ అంశంపై కన్నేసింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు... కృష్ణా జిల్లాలోని గనుల్లో తవ్వకాలు జరిపే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఎనిమిది అంతర్జాతీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. అమూల్యమైన వజ్రాల సంపదను తవ్వితీయాలనేది సత్సంకల్పమే. అయితే గతంలో మాదిరిగా రాజుల సొమ్ము రాళ్ళ పాలయినట్లు వజ్రాలు పరాయి వాళ్ళ చేతుల్లోకు పోకుండా చూసుకోవడం కూడా ప్రభుత్వాల కర్తవ్యం

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...