Thursday, June 27, 2013

కరువు సీమకు కావాలి జలకళ! -ఇమాం (కదలిక)

ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగస్వామిగా సుదీర్ఘ కాలం దాదాపు 250 సంవత్స రాలు కొనసాగిన
రాయలసీమ ను కర్నూలు రాజధానిగా 1953 లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేసి విడగొట్టారు. ఆ తరువాత 1956లో తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ పేర సమైక్య రాష్ట్రం ఏర్పరిచారు. కుట్రలు, కుతంత్రాలకు నిర్ల క్ష్యానికి గురైన ఫలితంగా వెనుకబడిన ప్రాంతంగా రాయ లసీమ ఉన్నదని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ధృవీకరిం చింది. 1901లో 300 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించతల పెట్టిన మెకంజీ స్కీంను అనేక మార్పులు, చేర్పులతో గం డికోట ప్రాజెక్టుగా మార్చి సీమవాసులను తీరని అన్యా యానికి గురిచేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ చేస్తూ సాగిన ఉద్యమ సందర్భంగా కోస్తాంధ్ర నాయక త్వంతో సీమవాసులకు కుదిరిన అవగాహన శ్రీబాగ్ ఒప్పందం’ 1937లో బుట్ట దాఖలా అయింది. నెల్లూరు జిల్లాతో సహా సీమవాసుల ప్రయోజనాలు నెరవేర్చిన తరువాత మాత్రమే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నీటి కేటాయింపులు చేసి, ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీని నిర్లక్ష్యం చేశారు. 1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును తెలుగు ప్రజల ప్రయో జనాల పరిరక్షణ పేరిట నిలువరించారు.

ఈ పథకం ఆనాడే కేంద్ర జలవనరుల మండలి ఆమోదాన్ని పొందిం ది. ఈ ప్రాజెక్టు బదులు నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మిం చారు. అలాగే సీమవాసుల దృష్టి మళ్లించేందుకు ఖోస్లా కమిషన్‌ను నియమించారు. నేటి శ్రీశైలం ప్రాజెక్టు స్థానం లో సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని ఖోస్లా కమిషన్ సూచించింది. అలాగే కె.సి. కాలువ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 3 వేల క్యూసెక్కుల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచాలని, గండికోట ప్రాజెక్టు 60 టీఎంసీల సామర్థ్యం తో నిర్మించాలని ప్రతిపాదించింది. తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరి-నగరి పేరుతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కృష్ణా-పెన్నార్, సిద్ధేశ్వరం ప్రాజెక్టుల ప్రతిపాదనలలో ఉన్నవే. మద్రాస్‌కు చెంగల్పట్టు జిల్లా ప్రయోజనాల పేర తాగునీటిని అందించే పథకం కూడా కృష్ణా-పెన్నార్ ప్రాజె క్టులో ఇమిడి ఉంది. ఈ పథకాలన్నీ రాయలసీమ, కోస్తాం ధ్ర, తెలంగాణ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రతిపాదించినవే! నిరంతరాయంగా కరువులకు గురవుతూవచ్చిన రాయలసీమ ప్రజలు తాగునీటికి, సాగు నీటికి జరిపిన పోరాటం అసాధారణం.

తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో దీర్ఘకాలం అభివృద్ధిలో సమగ్రత లోపించిన కారణంగా అన్ని రంగాలలో అసమానతలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా తాము తీవ్ర నిర్లక్ష్యానికి, అన్యాయానికి గుర య్యామనే భావన తెలంగాణ, రాయలసీమ ప్రజల్లో నాటుకుపోయింది. తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధి నినాదంగా మిగిలిపోయింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ తన 17 ఏళ్ల పాలనలో ప్రాంతాల మధ్య భావసమైక్యతను సాధించలేక పోయింది. పైగా టీడీపీ పాలనలో 1983 నుంచి 89 దాకా, 1997 నుంచి 2004 దాకా జలవనరులలో వాటా కోసం రాయలసీమలో ప్రజా ఉద్యమాలు నడిచాయి. మరోవైపు తెలంగాణ సోదరులు తమకు ప్రత్యేక తెలంగాణ నినా దంతో ఉద్యమిస్తున్నారు. వర్షాధార ప్రాంతాలైన రాయల సీమ, తెలంగాణ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ప్రజలు తమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రాలే పరిష్కార మార్గమని భావిస్తున్నారు.

వెఎస్సార్‌సీపీ ఎదుగుదలను నిలువరించడం ద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బలహీనపరచడానికి యూపీఏ ప్రభుత్వం రాయలసీమ విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, లేదంటే రాయల తెలంగాణ యోచన వంటి ప్రతిపాదనలతో ప్రజలలో అలజడిని సృష్టిస్తున్నాయి. తెలుగు ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలే తప్ప, ఒక పార్టీకి, ఆ పార్టీ అధ్య క్షునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ లాభనష్టాల దృష్టితో ఎత్తుగడలు పన్నితే ఆ పార్టీ ప్రజలకు మరింత దూరంకాక తప్పదు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని 60 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్నది. అలాగే ప్రత్యేక తెలంగాణ సమస్యను ఎలా పరిష్కరిం చాలో కూడా శ్రీకృష్ణ కమిటీ సూచించింది. రాష్ట్రంలో వేర్పాటు ఉద్యమాలకు నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల అంశం పునాదిరాయిగా ఉందనే అంశం గమనార్హం. నీటి వనరుల కేటాయింపునకు సంబంధించి మూడు ప్రాంతా లకు మధ్య పరస్పరం నెలకొని ఉన్న అనుమానాలు, అపోహలు, వివాదాలు పరిష్కరించగల దివ్యౌషధమే జలయజ్ఞం’. కోటి నలభై లక్షల ఎకరాల సేద్యపు నీటి వసతి కల్పనకు కోటి డెబ్భై ఐదువేల కోట్లతో బృహత్ ప్రణాళికను రూపొందించి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అపర భగీరథునిగా నిలిచారు. విద్యుత్, పారిశ్రామిక, వ్యవసాయరంగాల పురోభివృద్ధికి ప్రాము ఖ్యమిచ్చి రాష్ట్ర పురోగమనానికి గట్టి పునాదులు వేశారు. జలవనరుల వినియోగంలో అసమానతలు భిన్న ప్రాంతా లకు చెందిన జనం మధ్య విభేదాలు కల్పిస్తున్న సంగతి గ్రహించడంవల్లే ఐక్యతను అదే జలవనరులతో సాధించేం దుకు వైఎస్ ప్రతిష్టాత్మక జలయజ్ఞానికి అంకురార్పణ చేశారు. దివంగత నేత మరణానంతరం రాష్ట్రంలో జరుగు తున్నదేమిటి? 2009 డిసెంబర్ చివరన కేంద్ర ప్రభుత్వ ప్రకటన అనంతరం సమైక్యవాదం, ప్రత్యేకవాదం బలంగా ముందుకువచ్చాయి. నేటికీ ఈ రెండు పరిణా మాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిస్థి తులలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.
*Coutesy- Sakshi daily

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...