Monday, June 17, 2013

వ్యవస్థ క్రౌర్యాన్ని ప్రశ్నించిన కథంచిన కథకుడు కె. సభా- నాగసూరి వేణుగోపాల్‌

  పాతాళగంగ - కె.సభా కథను వినగానే మరోసారి చదవాలనిపించింది. మేము కడప ఆకాశవీదిలో సీమకథలను
డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌  
ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం, అందులో విన్న తర్వాత. నిజానికి కె.సభా కథలను నేను పెద్దగా చదవలేదు అనటంకంటే అసలు చదవలేదనటం సబబుచాయన తన కథల్లో వాస్తవాన్ని ఎంత చక్కగా, గొప్పగా పరిశీలించాడు, చిత్రించాడు అనిపించింది. రచయితకు వ్యక్తుల పట్ల లాలిత్యం ఉన్నా- వ్యవస్థ పట్ల కాఠిన్యం ఉంది. అది వ్యంగ్యంలో ప్రతిధ్వనిస్తుంది. ప్రాంతీయమైన పద సంపద కొన్నిచోట్ల పరిమళిస్తే, మరికొన్నిచోట్ల కలంతో చిత్రించిన మనోహర జీవన దృశ్యాలు గొప్పగా తారసపడతాయి. జైజవాన్‌, జైకిసాన్‌, జైభారత్‌ వంటి నినాదాల్ని తీసుకుని జీవన విషాదాన్ని, వ్యవస్థ వికృతాన్ని నింపి అద్భుతంగా కథను మలిచారు. వట్టి నినాదం మూలబిందువుగా అంతగొప్పగా వాస్తవిక కళారూపాన్ని కె.సభా ఎలా మలచగలిగారా అని కూడా ఆశ్చర్యం కలుగుతుంది.
పంజాబు ప్రాంతంలో పాకిస్తాన్‌తో పోరాడుతున్న సీమ యువకుడు అబ్బోతు (ఆనందం). సీమ ప్రాంతంలో పాతాళగంగ కోసం బావి తవ్వుతున్న అబ్బోతు తండ్రి బేటప్ప. యుద్ధంలో తన కొడుకూ, పాతాళగంగను సాధించడంలో తన భర్త విజయం కైవశం చేసుకోవాలని తపించే చెంగమ్మ. ఈ ఇద్దరి విజయాలు ఆశించి, అసలు వాస్తవాలు దాచుకుని తల్లడిల్లే కన్నెపిల్ల- చెంగమ్మ అన్న కూతురు కస్తూరి. ఈ నాలుగు పాత్రలే కథానంతా పరుచుకుని ఉంటాయి. ఈ పాత్రలు నాలుగు పూర్తిగా తప్పుకుని ముగింపును మహావిషాదం చేస్తాయి. దాంతో పాఠకుల మనసు వికలమవుతుంది, క్రోధపూరితమవుతుంది, జుగుస్సాభరితమవుతుంది.
చేదలో గంగ సాక్షాత్కరించిందని ఎంతమందో భ్రమలో పడి, కృష్ణయ్య వంటివారి చెప్పుడు మాటలు విని, బావి తవ్వడమనే ఊబిలో చిక్కుకుని, భార్య నగలు, ఎడ్లు, బండి, పొలం, తన నగలు, కోడలు నగలు త్యాగం చేసి- మొత్తం కుటుంబం పాతాళంలోకి పోవడం కథావస్తువు. భాష, వ్యక్తీకరణ పూర్తిగా స్థానికం.
ఈ పదచిత్రణలు చిలికించిన దృశ్యాలు ఏమిటో అందుకోండి :
'అప్పుడే పొంగుతూ ఉన్న పాలపై నీళ్ళు చల్లి దించిపెడుతున్న చెంగమ్మ చెవుల్లో ఈ శుభవార్త పడగానే ఆమె కళ్ళు, చెవూలూ కలిసిపోయినవి. ఎలా తెలుసుకున్నదో పాలు తాగుతూ ఉండిన లేగదూడ పరుగుతో వచ్చి చెంగమ్మ చీరకొంగును కసకసమని నమిలేస్తుంది. ఆనందం పట్టలేక ఆ ఇల్లాలు లేగను అమాంతంగా ఎత్తి ముద్దెట్టుకుని వాకిట్లో దించి తిన్నెపై తవుడు బుట్టలో ఉన్న ఎన్నెర్ర చివుళ్ళను దాని నోటికందిస్తూ, పెదిమల్ని మెదపగానే...-' గ్రామీణ దృశ్యాన్నీ పరమాద్భుతంగా చిత్రించిన సన్నివేశమిది. పశుసంపదను గ్రామ ప్రజానీకం ఎంతగా ప్రేమిస్తారో, తమ ఆనందాన్ని వాటితో ఎలా పంచుకుంటారో మహోన్నతంగా వ్యక్తీకరించారు. కె.సభా.
'అబ్బోతి మాట వినగానే పసుపు కొమ్మువలె నిగనిగలాడే కస్తూరి తనూలత కుంకుమ వన్నెల విసనకర్ర అయి కమ్మని వలపు వాసనలను దశదిశలకు పంచి పెట్టింది. ఇంటికొప్పుపై నర్తిస్తున్న ఉడతల జంట ఎవరికీ తెలియని విశేషాలనేమో ఎంతో గోప్యంగా ముచ్చటించుకుంటున్నది. ఎన్నుగాటికి ఉత్తరపు కొనలో ఊరపిచ్చుకలు అంతకంటే మక్కువతో దాచుకొంటున్నవి.'
ఇది చిత్రం కాదు, వీడియో. పల్లె పట్టు ప్రకృతితో మమేకమైన పర్యావరణ సౌందర్యాన్నీ, కన్నెమనసు పులకరింతనూ కలిపి మేళవించడం కె.సభా కథన కౌశలం.
రచయితకు పరిశీలించగలిగే శక్తీ, వ్యక్తీకరించగలిగే యుక్తీ ఉంటే పాఠకుడు అదృష్టవంతుడు. మామూలుగా ఈ వాస్తవాన్ని పాఠకుడు తన కళ్ళెదుటున్నా చూడలేకపోవచ్చు ఇక్కడ రచయిత మనోక్షేత్రం పాఠకునికి మార్గదర్శకమవుతుంది.
'ఆరో మట్టులో కూడా బండనే పరచుకున్న బావి 'అం..' అని చెరువంతనోరు తెరుచుకొని తొంగిచూచిన వారినెల్లా మింగుతానంటున్నది.'
'దగ్గుదగ్గుగానే ఆగకుండా చెంగమ్మలో ఏదో ఆయాసం ముంచుకు వచ్చింది. మంచంపై బల్లిలా కరుచుకుపోయింది. ఇల్లాలు నేలబడగానే బేటప్పలో ధైన్యం ఆవేశించినది. ఆ పది గుంటలమ్మిన పైకం సైతం కర్పూరంలా కరిగిపోయింది. కస్తూరి జీలుగబెండువలె ఎండిపోతూంది.'
'అది బ్రహ్మముహూర్తం,. ఈశాన్య మూల నుంచి ఏదో ధ్వని విన్పించింది. పదేళ్ళ క్రితం విన్న తలకోన జర్తెలోని ప్రణనాన్ని స్మృతికి తెచ్చింది. మరీ దగ్గరికి జరిగి చెవినిచ్చి విన్నాడు. ఆ మూలనే ముక్కోలు మట్టిత్తులో సప్త స్వరాల సమ్మేళనం వలె పాతాళగంగ పాడుతున్న పాట వినిపించింది.'
.... ఇలా రచయిత సభా నేర్పరితనానికి చాలా మచ్చుతునకలు కనబడతాయి.
'చేదలో గంగ పడిందనీ, కరణం చెప్పాడనీ, సబ్సిడీ లోనుతో బావి పూర్తవుతుందనీ దిగిన బేటప్పకు బండరాళ్ళే ఎదురయ్యాయి. సబ్సిడీ రాలేదు, లోనూ రాలేదు.. పట్టుదల ఆగలేదు.. తొలుత గజ్జెలడ్డిగె కుదవ బెట్టాడు. అది చెంగమ్మదని చెప్పనక్కర లేదు. తర్వాత ఒక్కోక్కటి బావి ఖర్చులో పోతూ వచ్చాయి. ఆ క్రమం ఇలా ఉంది : ఎద్దులు, నాలుగు ఆవులు, 22 మేకలు, చెంగమ్మ చెవుల్లో కర్నపూలు, గూచపట్లు, బొందుపోగులు, నోముల ముళ్ళు, కస్తూరి తెల్లరాళ్ళ కమ్మలు, నీలాల తొంగటాలు; బేటప్పకు తెలియకుండా చెంగమ్మ తన కమ్మీలూ మాటీలు కుదువబెట్టడం ; ఏటికాలవమడి, ఊట కాలవ మాన్యం... మిగిలిన పది గుంటల నేల కూడా అమ్మి చెంగమ్మను ఆస్పత్రిలో చేర్పించడం, రెండెద్దుల బండి అమ్మకం, తాటి చెట్లు, చింత మాను, బేటప్ప వెండి మొలతాడు, పనసకాయ 
డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌    
Mon, 17 Jun 2013, Prajasakti daily

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...