కోస్తా ప్రాంతంలో ఆధునిక సాహిత్య ప్రక్రియలు మొదలైన చాలా కాలానికి కూడా రాయలసీమలో ఆధునిక వాసన
లేనేలేదనే అభిప్రాయం నిన్నటి, మొన్నటి వరకు సాహిత్య కారుల్లో ఉండేది. ఇవాళ నవల, విమర్శ, కథానిక, నాటకం మొదలైన ఆధునిక ప్రక్రియలు అన్నిప్రాంతాలతో సమానంగా రాయలసీమలో కూడా వచ్చాయనే అవగాహన కలుగుతున్నది. వీటిలో నవల, విమర్శ రాయలసీమ నుండే మొదలయ్యాయి.
లేనేలేదనే అభిప్రాయం నిన్నటి, మొన్నటి వరకు సాహిత్య కారుల్లో ఉండేది. ఇవాళ నవల, విమర్శ, కథానిక, నాటకం మొదలైన ఆధునిక ప్రక్రియలు అన్నిప్రాంతాలతో సమానంగా రాయలసీమలో కూడా వచ్చాయనే అవగాహన కలుగుతున్నది. వీటిలో నవల, విమర్శ రాయలసీమ నుండే మొదలయ్యాయి.
ఆధునిక వచనకావ్యంగా ప్రసిద్ధి చెందిన నవల ప్రపంచస్థాయి నుండి ప్రాంతీయ స్థాయివరకూ అనేక మంది రచయితల్ని ప్రేరేపించింది. నవల భారత దేశంలో 1865లో బంకించంద్ర ఛటర్జీతో మొదలైందని విమర్శకుల అభిప్రాయం. దీనిని మార్గదర్శకంగా తీసుకొని తొలి తరంలోనే (దేశ) నవలా రచయితలు సమాజాన్ని చిత్రించే అద్భుతమైన నవలల్ని మనకు అందించారు. నవలా చరిత్రలో పురుషుల చరిత్ర రికార్డు అయినంతగా నవలలా రచయిత్రుల చరిత్ర రికార్డు కాకపోవడం శోచనీయం. నవలా చరిత్ర రచనల లోపం వల్ల తొలి తరం నవలలా రచయిత్రుల నవలలు సమాజానికి పరిచయం కాలేక పోయాయి.
వీటిపైన పరిశోధన కూడా పరిమితంగానే జరిగింది. కానీ ప్రపంచ నవలా సాహిత్యం ముందుగా రచయిత్రితోనే మొదలయిందనే విషయనాన్ని గమనించాలి. క్రీ.శ.11వ శతాబ్దం మొదటి భాగంలో ‘మురాసాకిషకుచు’ అనే జపాన్ రచయిత్రి ‘గెంజిమోనో గోతారి’ (గెంజిగాథ అనే నవల రాశారు. ప్రపంచ నవలా సాహిత్యంలో ఈ నవల మొదటిదని పాశ్చాత్య విమర్శకుల అభిప్రాయం. ఈ నవల ‘గెంజి గాథ’ అనే పేరు తో తెలుగులోకి అనువాదం అయింది. రచయిత్రితో మొదలైన నవలా సాహిత్యంలో రచయిత్రుల స్థానం పరిమితంగా కనిపించడం ఆశ్చర్యపడాల్సిన విషయం. ఇదే పరిస్థితి భారతదేశంలో కూడా ఉంది. భారతదేశ తొలి నవలా రచయిత్రి విషయం పెద్దగా చర్చకు రాలేదనిపిస్తుంది.
తెలుగులో తొలి నవలా రచయిత్రి ‘జయంతి సూరమ్మ’ అని సాహిత్యకారుల అభిప్రాయం. రాయలసీమలో తొలితరం నవలా రచయితల గురించి వాదోపవాదా లు జరిగాయి. ప్రస్తుతం పరిశోధనలూ జరుగుతున్నాయి. కానీ సీమ నవలా రచ యిత్రుల గురించి ఎవరూ పేర్కొనడం లేదు. కోస్తా ప్రాంతంలో ఆధునిక సాహిత్య ప్రక్రియలు మొదలైన చాలా కాలానికి కూడా రాయలసీమలో ఆధునిక వాసన లేనే లేదనే అభిప్రాయం నిన్నటి, మొన్నటి వరకు సాహిత్య కారుల్లో ఉండేది. ఇవాళ నవల, విమర్శ, కథానిక, నాటకం మొదలైన ఆధునిక ప్రక్రియలు అన్నిప్రాంతాలతో సమానంగా రాయలసీమలో కూడా వచ్చాయనే అవగాహన కలుగుతున్నది. వీటిలో నవల, విమర్శ రాయలసీమ నుండే మొదలయ్యాయి.
అయితే తెలుగు సాహిత్యం దీని గురించి అంతగా పట్టించుకోలేదు. ఇదే పరిస్థితి రాయలసీమ రచయిత్రులకు కూడా పట్టింది. తెలుగులో మొదటి నవలారచయిత్రి కొస్తా ప్రాంతానికి చెందిన ‘జయంతి సూరమ్మ’, ఈమె రాసిన నవల ‘సుదక్షిణా చరిత్రము’ (1906). దీని తర్వాత మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతి చరిత్ర’(1914), ఎ.పి.పిరాట్టమ్మ ‘శోభా వతి’ (1924), కనుపర్తి వరలక్షుమ్మ ‘వసుమతి’ (1924) మొదలైన నవలలు తొలి తరంలో వచ్చినట్లు ‘సమాలోచనం’ అనే వ్యాస సంపుటిలో జి. లలిత ‘నవల- మహిళ’ అనే వ్యాసంలో పేర్కొన్నారు. జయంతి సూరమ్మ ‘సుదక్షిణా చరిత్రము’ (1906) తర్వాత రాయలసీమకు చెందిన దేవమణి సత్యనాథన్ రాసిన ‘లలిత’ (1908) నవల వచ్చింది.
ఈ నవలల గురించి ఎవ్వరూ ఎక్కడా చర్చించలేదు. పైగా దేవమణి సత్యనాథన్ రాసిన తొలి తెలుగు సాంఘిక నవలల ‘లలిత’ (1908)ను, వదిలేసి 1924లో ఎ.పి. పిరాట్టమ్మ రాసిన ‘శోభావతి’ నవలను తొలి తెలుగు సాంఘిక నవలగా గుర్తించారు సాహిత్యచరిత్రకారులు. కానీ తెలుగులో తొలి సాంఘిక నవల ‘లలిత’ అని చెప్పవచ్చు. ఈ నవలను రాసిన దేవమణి సత్యనాథన్ రాయలసీమలో తొలినవలా రచయిత్రి. అంతేకాదు ఆమె తెలుగులో రెండవ నవలా రచయిత్రికూడా అవుతారు. ఆమె గురించి మరో విశేషం- ఆమె తొలి తెలుగు సాంఘిక నవలా రచయిత్రి కూడా.
దేవమణి సత్యనాథన్ రాసిన ‘లలిత’నవలను ‘సీమ నవల తొలిదశ’ అనే వ్యాసంలో (సూర్య, జనవరి 28, 2013) క్రీ.శ.1927కి చెందినదిగా పేర్కొన్నాను. కానీ ఆ అభిప్రా యాన్ని కొంత పరిశోధన ద్వారా మార్చుకోవలసి వచ్చింది. 1927లో ‘లలిత’ నవల ద్వితీయ ముద్రణ జరిగింది. 1928లో ‘లలిత’ నవల10వ తరగతి పాఠ్యగ్రంథంగా ఉంది. నవలలోని అంతర్గత ఆధారాన్ని బట్టి ఈ నవల మొదటి ముద్రణ 1908లో జరిగినట్లు తెలుస్తుంది.
ఈ నవలలో ‘లలిత’ రాజమండ్రిలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ బళ్ళారి జిల్లాలోని కమలాపురంలో ఉన్న తన బావ హరిదాసుకు 1908 జూలై 12న ఉత్తరం రాసినట్లు నవలలో ఉంది. దీనినిబట్టి ఈ నవల 1908లో వచ్చిఉండ వచ్చునని భావించవచ్చు. అప్పటి ప్రొద్దుటూరు తాలుకా బోర్డు ప్రెసిడెంటు కూరం నరసింహాచార్యులు ‘లలిత’ నవలకు ముందుమాట రాశారు. అందులో ఆయన రచయిత్రి గురించి చెబుతూ ‘గ్రంథములు వ్రాయుటకిది ప్రథమప్రయత్నం అని గ్రంథకర్తియే చెప్పుచున్నది-రుూ వధూమణి మా మండలములోని స్ర్తీలకు మార్గదర్శినియై యందఱికృతజ్ఞతకు బాత్రురాలగుచు న్నది’అని అన్నారు.
దేవమణి సత్యనాథన్ రచనా ప్రస్థానంలో ‘లలిత’ నవల తొలి ప్రయత్నం. ఈ రచయిత్రి దత్తమండలాలలోని రచయిత్రులందరికీ మార్గదర్శకం అవుతుందన్న నరసింహాచార్యులు అభిప్రాయాన్నిబట్టి ఈ రచయిత్రికి ముందు రాయలసీమలో రచయిత్రులు లేరని తెలుస్తుంది. కాబట్టి రాయలసీమ తొలి నవలా రచయిత్రి, తెలుగులో తొలి సాంఘిక నవలా రచయిత్రి దేవమణి సత్యనాథన్. దేవమణి సత్యనాథన్ అనంతపురంజిల్లాలోని ధర్మవరంవాసి అని కూరం నరసిం హాచార్యులు ‘లలిత’ నవలకు వ్రాసిన ముందుమాటలో చెప్పారు. తర్వాత ఈమె మద్రాసులో స్థిరనివాసం ఏర్పచుకున్నారు. ఈమెను హన్నమ్మ, డేవిడ్ అనే దంప తులు దత్తత తీసుకొని పెంచిపెద్ద చేశారు.
పెంపుడు తల్లిదండ్రులవల్ల ఈమె వ్యక్తిత్వం హిందూ క్రైస్తవ సమన్వయాత్మక మైంది. రచయిత్రి జనన, మరణాల తేదీలు లభ్యం కాలేదు. కానీ ఈమె 20వ శతాబ్దానికి పూర్వార్థంలో జీవించిన తొలి తరం రచయిత్రులలో ఒకరని ‘తెలుగు సాహిత్య కోశము’ (1850-1950వరకు) అనే గ్రంథంద్వారా తెలుస్తోంది. రచయిత్రి ఈ నవలను తనను పెంచిన తల్లిదండ్రులకు అంకితం చేశారు.
1908లో దేవమణి సత్యనాథన్ రాసిన ‘లలిత’ నవల స్ర్తీ విద్య ప్రభావాన్ని ఆవిష్కరిస్తూ, స్ర్తీ వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూఉంది. అక్కను, తల్లినీ పోగొట్టుకున్న లలితకు తండ్రికూడా పిచ్చివాడై పోగా, అన్నదమ్ములు బిచ్చగాళ్ళైపోగా తనను బలవంతం చేస్తున్న వసంతుని బారినుండి తప్పించుకొని మేనమామ కొడుకు హరిదాసును అనేక సాహసాలతర్వాత వివాహం చేసుకుంటుంది.
చదువు ఇచ్చిన సంస్కారమువల్ల సమస్యలనుచూసి బెదిరిపోకుం డా సమాజంలోని మంచివాళ్ళ సహకారంతో సమస్యల నుండి గట్టెక్కిన స్ర్తీ కథ ఈ ‘లలిత’ నవల. ఈ నవలలో హరిదాసుడు, లలిత ప్రధానపాత్రలు. సౌందర్యవతి అయిన లలిత హరిదాసుపై తనకున్న ప్రేమను నిలబెట్టు కోవడానికి, హరిదాసునే పెళ్ళిచేసు కోవడానికి ఎన్నోకష్టాలను ఎదుర్కొంటుంది, చివరికి జయి స్తుంది. లలిత తండ్రి సోమనాథుడు తాగుబోతు. ఈ పాత్రద్వారా తాగుడువల్లవచ్చే నష్టాలను, కష్టాలను రచయిత్రి చిత్రించారు.
లలిత నవల సంఘసంస్కార నవలల. ముఖ్యంగా సమాజంలో ని మథ్యపానంవల్ల వచ్చే నష్టాలు, స్ర్తీవిద్యవల్ల కలిగే సుఖాలు ఈ నవలలో చిత్రితమయ్యాయి. జూదం, చెడుసావాసాలు, చెడు ఆలోచనలు, ప్రాణహానికి దారితీస్తాయ ని ఈ నవలలో రచయిత్రి సూచన ప్రాయంగా తెలియజేశారు. లలిత నవలలో సోమనాథుడు విజయనగరంలో రక్షకభటఉద్యోగి.అయితే మితిమీరిన తాగుబోతు. ప్రభుత్వంఇచ్చే జీతం చాలక పేదలను లంచాలకోసం పీడించేవాడు. సోమనాధుడు పెట్టే బాధలకు ఓర్వలేక ఆటవికులు సోమనాథునిమీద పగతో సోమనాథుని కూతు రైన లలితను కాళికాదేవికి బలి ఇచ్చి సోమనాథునిపై పగతీర్చుకోవాలనుకుంటారు. సోమనాథుడు తాగుడుకోసం ఆటవికులను వేధించడమే వారి పగకు కారణం.
తాగుబోతుల లక్షణాలను రచయిత్రి తెలియజేస్తూ- ‘త్రాగుబోతుల నడవళ్లు శోచ నీయములు. అతడొక్కొక మారు మధువును గ్రోలు చు దానిమూలమున జనించిన మైకముచే దూగుచుండును. చిరపరిచయులగు మధుపాన మిత్రులంగాంచిన, దూలుచు వారివెంట బికారివోలె దిరుగుచుండును. మితిమించిన మత్తుచే గ్రిందపడి పొరలుచుండును. దుర్భాషలనాడుచుండును. లజ్జలేక తిరుగు చుండును. అతిహేయములగు విషయములం జిక్కి యొక్కొకతఱి వెఱ్ఱివానివొలె వెడలు చుండును. వెఱ్ఱివేయివిధ ములన్నట్లాతడిట్లున్మత్తుడగుటచే చెడునడతలకడలి రక్షకభట వర్గమునుండి ప్రభుత్వమువారీతని దొలగించిరి.
ఇపుడు సోమనాథుని పిచ్చి పెచ్చుపెరిగి నితడు వీధివీధులందిరుగజొచ్చెను. చూచినవారిపై నెల్లను బాషాణములంబ్రయోగింపసాగెను. చిరపరిచితులగువారు తన్నుబ్రేమింపజొచ్చిన పలుమాఱు వారిని దిట్టుచుండెను. ఇట్లందఱికయిష్టుడై స్వ కుటుంబమునకు దూరుడై పుత్రులనెన్నక లలితయందలి ప్రీతిని దోలి, హేయ గుణపూరితుడై, తుదకాతుడు దేశముల వెంబడి దిరుగజొచ్చెను. ఆహా! మథుపా నము కుటుంబముల కెట్టియరిష్టమును దెచ్చున్నదో చూడుడు’.
సోమనాథుడి తాగుడువల్ల కూతురు చనిపోగా, భార్యను పొగొట్టుకొని పిచ్చివాడై దేశదిమ్మరి అవుతాడు. రాజమండ్రిలో ఉంటున్న లలిత పిచ్చివాడైన తండ్రిని గుర్తు పట్టి వైద్యం చేయించి మామూలు మనిషిగా చేస్తుంది. సోమనాథుడు రాజమండ్రి న్యాయస్థానంలో ఉద్యోగంచేస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. లలితకు ఇష్టంలేని సంబంధంచూసి పెళ్ళిచేసుకోవాలని బలవంతంచేస్తాడు. తన మాటలు వినని లలితపై కేసు పెడతాడు. ఓడిపోతాడు.మళ్ళీతాగుడుబోతై దేశదిమ్మరి అవుతాడు.
దేవమణి సత్యనాథన్ ‘లలిత’ నవలలో స్ర్తీ చదువుకోవాలనే సందేశాన్ని ఇచ్చారు. నిజానికి స్ర్తీ చదువు సమాజానికి, కుటుంబానికి చాలా అవసరం. ఈ నవలలో లలిత చదువుకోవడంవల్ల ప్రతి విషయంలో సమయస్పూర్తిని పాటించింది. సమ యానికి తగిన నిర్ణయాలు తీసుకొని ఆపదల నుండి గట్టెక్కింది. పట్టుదలతో తాను ప్రేమించిన బావనే పెళ్ళిచేసుకుంది దేవమణి సత్యనాథన్ సృష్టించిన లలిత పాత్ర ఆదర్శవంతమైంది. అందుకే ‘లలిత’ నవల సంఘసంస్కరణ నవల.
దేవమణి సత్యనాథన్ ‘లలిత’ నవలలో రాయలసీమ ప్రాంతానికే ప్రాముఖ్యతను ఇచ్చారు. లలిత ఉత్తర సర్కారులోని విజయనగరంలో పుట్టి అక్కడే చదువుకుం టుంది. విజయనగరంలో తల్లి, దండ్రి, అక్క, అన్నదమ్ములు అందరూ దూరమైన తర్వాత దుర్మార్గుడైన వసంతుడు పెట్టే బాధలను భరించలేక ప్రాణ,మాన పరిరక్షణకు పురుషునిగా రూపాన్ని మార్చుకొని తనబావ హరిదాసుడు ఉంటున్న కమలాపు రానికి వస్తుంది.
ఈ కమలాపురం రాయలసీమప్రాంతం బళ్ళారి జిల్లాలో ఉంది. లలిత బావ హరిదాసుడు లలితను మరచిపోలేక, తన తండ్రివల్ల ఇంట్లో స్థానం ఇవ్వలేక స్నేహితుడి సహాయంతో లలితను రహస్యంగా కమలాపురంనుండి రాజమండ్రికి చేరుస్తాడు. లలిత రాజమండ్రిలో కష్టాలను ఎదిరించి, గెలిచి చివరికి కమలాపురం చేరుకుంటుంది. అక్కడే తనబావను పెళ్ళిచేసుకుంటుంది.
లలిత విజయనగరంలో పుట్టినా, రాజమండ్రిలో కొంతకాలం నివసించినా మొత్తానికి కమలాపురమే ఆమె జీవితానికి ఆధారమైన ప్రాంతం. కాబట్టి రచయిత్రి ఈ నవలలో కమలాపురాన్నే కేంద్రంగాచేసి రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యతనిచ్చారు. దేవమణి సత్యనాథన్ రాయల సీమలో తొలి నవలారచయిత్రి ఈ ‘లలిత’ అనే సాంఘికనవల ద్వారా చెప్పవచ్చు.
వీటిపైన పరిశోధన కూడా పరిమితంగానే జరిగింది. కానీ ప్రపంచ నవలా సాహిత్యం ముందుగా రచయిత్రితోనే మొదలయిందనే విషయనాన్ని గమనించాలి. క్రీ.శ.11వ శతాబ్దం మొదటి భాగంలో ‘మురాసాకిషకుచు’ అనే జపాన్ రచయిత్రి ‘గెంజిమోనో గోతారి’ (గెంజిగాథ అనే నవల రాశారు. ప్రపంచ నవలా సాహిత్యంలో ఈ నవల మొదటిదని పాశ్చాత్య విమర్శకుల అభిప్రాయం. ఈ నవల ‘గెంజి గాథ’ అనే పేరు తో తెలుగులోకి అనువాదం అయింది. రచయిత్రితో మొదలైన నవలా సాహిత్యంలో రచయిత్రుల స్థానం పరిమితంగా కనిపించడం ఆశ్చర్యపడాల్సిన విషయం. ఇదే పరిస్థితి భారతదేశంలో కూడా ఉంది. భారతదేశ తొలి నవలా రచయిత్రి విషయం పెద్దగా చర్చకు రాలేదనిపిస్తుంది.
తెలుగులో తొలి నవలా రచయిత్రి ‘జయంతి సూరమ్మ’ అని సాహిత్యకారుల అభిప్రాయం. రాయలసీమలో తొలితరం నవలా రచయితల గురించి వాదోపవాదా లు జరిగాయి. ప్రస్తుతం పరిశోధనలూ జరుగుతున్నాయి. కానీ సీమ నవలా రచ యిత్రుల గురించి ఎవరూ పేర్కొనడం లేదు. కోస్తా ప్రాంతంలో ఆధునిక సాహిత్య ప్రక్రియలు మొదలైన చాలా కాలానికి కూడా రాయలసీమలో ఆధునిక వాసన లేనే లేదనే అభిప్రాయం నిన్నటి, మొన్నటి వరకు సాహిత్య కారుల్లో ఉండేది. ఇవాళ నవల, విమర్శ, కథానిక, నాటకం మొదలైన ఆధునిక ప్రక్రియలు అన్నిప్రాంతాలతో సమానంగా రాయలసీమలో కూడా వచ్చాయనే అవగాహన కలుగుతున్నది. వీటిలో నవల, విమర్శ రాయలసీమ నుండే మొదలయ్యాయి.
అయితే తెలుగు సాహిత్యం దీని గురించి అంతగా పట్టించుకోలేదు. ఇదే పరిస్థితి రాయలసీమ రచయిత్రులకు కూడా పట్టింది. తెలుగులో మొదటి నవలారచయిత్రి కొస్తా ప్రాంతానికి చెందిన ‘జయంతి సూరమ్మ’, ఈమె రాసిన నవల ‘సుదక్షిణా చరిత్రము’ (1906). దీని తర్వాత మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతి చరిత్ర’(1914), ఎ.పి.పిరాట్టమ్మ ‘శోభా వతి’ (1924), కనుపర్తి వరలక్షుమ్మ ‘వసుమతి’ (1924) మొదలైన నవలలు తొలి తరంలో వచ్చినట్లు ‘సమాలోచనం’ అనే వ్యాస సంపుటిలో జి. లలిత ‘నవల- మహిళ’ అనే వ్యాసంలో పేర్కొన్నారు. జయంతి సూరమ్మ ‘సుదక్షిణా చరిత్రము’ (1906) తర్వాత రాయలసీమకు చెందిన దేవమణి సత్యనాథన్ రాసిన ‘లలిత’ (1908) నవల వచ్చింది.
ఈ నవలల గురించి ఎవ్వరూ ఎక్కడా చర్చించలేదు. పైగా దేవమణి సత్యనాథన్ రాసిన తొలి తెలుగు సాంఘిక నవలల ‘లలిత’ (1908)ను, వదిలేసి 1924లో ఎ.పి. పిరాట్టమ్మ రాసిన ‘శోభావతి’ నవలను తొలి తెలుగు సాంఘిక నవలగా గుర్తించారు సాహిత్యచరిత్రకారులు. కానీ తెలుగులో తొలి సాంఘిక నవల ‘లలిత’ అని చెప్పవచ్చు. ఈ నవలను రాసిన దేవమణి సత్యనాథన్ రాయలసీమలో తొలినవలా రచయిత్రి. అంతేకాదు ఆమె తెలుగులో రెండవ నవలా రచయిత్రికూడా అవుతారు. ఆమె గురించి మరో విశేషం- ఆమె తొలి తెలుగు సాంఘిక నవలా రచయిత్రి కూడా.
దేవమణి సత్యనాథన్ రాసిన ‘లలిత’నవలను ‘సీమ నవల తొలిదశ’ అనే వ్యాసంలో (సూర్య, జనవరి 28, 2013) క్రీ.శ.1927కి చెందినదిగా పేర్కొన్నాను. కానీ ఆ అభిప్రా యాన్ని కొంత పరిశోధన ద్వారా మార్చుకోవలసి వచ్చింది. 1927లో ‘లలిత’ నవల ద్వితీయ ముద్రణ జరిగింది. 1928లో ‘లలిత’ నవల10వ తరగతి పాఠ్యగ్రంథంగా ఉంది. నవలలోని అంతర్గత ఆధారాన్ని బట్టి ఈ నవల మొదటి ముద్రణ 1908లో జరిగినట్లు తెలుస్తుంది.
ఈ నవలలో ‘లలిత’ రాజమండ్రిలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ బళ్ళారి జిల్లాలోని కమలాపురంలో ఉన్న తన బావ హరిదాసుకు 1908 జూలై 12న ఉత్తరం రాసినట్లు నవలలో ఉంది. దీనినిబట్టి ఈ నవల 1908లో వచ్చిఉండ వచ్చునని భావించవచ్చు. అప్పటి ప్రొద్దుటూరు తాలుకా బోర్డు ప్రెసిడెంటు కూరం నరసింహాచార్యులు ‘లలిత’ నవలకు ముందుమాట రాశారు. అందులో ఆయన రచయిత్రి గురించి చెబుతూ ‘గ్రంథములు వ్రాయుటకిది ప్రథమప్రయత్నం అని గ్రంథకర్తియే చెప్పుచున్నది-రుూ వధూమణి మా మండలములోని స్ర్తీలకు మార్గదర్శినియై యందఱికృతజ్ఞతకు బాత్రురాలగుచు న్నది’అని అన్నారు.
దేవమణి సత్యనాథన్ రచనా ప్రస్థానంలో ‘లలిత’ నవల తొలి ప్రయత్నం. ఈ రచయిత్రి దత్తమండలాలలోని రచయిత్రులందరికీ మార్గదర్శకం అవుతుందన్న నరసింహాచార్యులు అభిప్రాయాన్నిబట్టి ఈ రచయిత్రికి ముందు రాయలసీమలో రచయిత్రులు లేరని తెలుస్తుంది. కాబట్టి రాయలసీమ తొలి నవలా రచయిత్రి, తెలుగులో తొలి సాంఘిక నవలా రచయిత్రి దేవమణి సత్యనాథన్. దేవమణి సత్యనాథన్ అనంతపురంజిల్లాలోని ధర్మవరంవాసి అని కూరం నరసిం హాచార్యులు ‘లలిత’ నవలకు వ్రాసిన ముందుమాటలో చెప్పారు. తర్వాత ఈమె మద్రాసులో స్థిరనివాసం ఏర్పచుకున్నారు. ఈమెను హన్నమ్మ, డేవిడ్ అనే దంప తులు దత్తత తీసుకొని పెంచిపెద్ద చేశారు.
పెంపుడు తల్లిదండ్రులవల్ల ఈమె వ్యక్తిత్వం హిందూ క్రైస్తవ సమన్వయాత్మక మైంది. రచయిత్రి జనన, మరణాల తేదీలు లభ్యం కాలేదు. కానీ ఈమె 20వ శతాబ్దానికి పూర్వార్థంలో జీవించిన తొలి తరం రచయిత్రులలో ఒకరని ‘తెలుగు సాహిత్య కోశము’ (1850-1950వరకు) అనే గ్రంథంద్వారా తెలుస్తోంది. రచయిత్రి ఈ నవలను తనను పెంచిన తల్లిదండ్రులకు అంకితం చేశారు.
1908లో దేవమణి సత్యనాథన్ రాసిన ‘లలిత’ నవల స్ర్తీ విద్య ప్రభావాన్ని ఆవిష్కరిస్తూ, స్ర్తీ వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూఉంది. అక్కను, తల్లినీ పోగొట్టుకున్న లలితకు తండ్రికూడా పిచ్చివాడై పోగా, అన్నదమ్ములు బిచ్చగాళ్ళైపోగా తనను బలవంతం చేస్తున్న వసంతుని బారినుండి తప్పించుకొని మేనమామ కొడుకు హరిదాసును అనేక సాహసాలతర్వాత వివాహం చేసుకుంటుంది.
చదువు ఇచ్చిన సంస్కారమువల్ల సమస్యలనుచూసి బెదిరిపోకుం డా సమాజంలోని మంచివాళ్ళ సహకారంతో సమస్యల నుండి గట్టెక్కిన స్ర్తీ కథ ఈ ‘లలిత’ నవల. ఈ నవలలో హరిదాసుడు, లలిత ప్రధానపాత్రలు. సౌందర్యవతి అయిన లలిత హరిదాసుపై తనకున్న ప్రేమను నిలబెట్టు కోవడానికి, హరిదాసునే పెళ్ళిచేసు కోవడానికి ఎన్నోకష్టాలను ఎదుర్కొంటుంది, చివరికి జయి స్తుంది. లలిత తండ్రి సోమనాథుడు తాగుబోతు. ఈ పాత్రద్వారా తాగుడువల్లవచ్చే నష్టాలను, కష్టాలను రచయిత్రి చిత్రించారు.
లలిత నవల సంఘసంస్కార నవలల. ముఖ్యంగా సమాజంలో ని మథ్యపానంవల్ల వచ్చే నష్టాలు, స్ర్తీవిద్యవల్ల కలిగే సుఖాలు ఈ నవలలో చిత్రితమయ్యాయి. జూదం, చెడుసావాసాలు, చెడు ఆలోచనలు, ప్రాణహానికి దారితీస్తాయ ని ఈ నవలలో రచయిత్రి సూచన ప్రాయంగా తెలియజేశారు. లలిత నవలలో సోమనాథుడు విజయనగరంలో రక్షకభటఉద్యోగి.అయితే మితిమీరిన తాగుబోతు. ప్రభుత్వంఇచ్చే జీతం చాలక పేదలను లంచాలకోసం పీడించేవాడు. సోమనాధుడు పెట్టే బాధలకు ఓర్వలేక ఆటవికులు సోమనాథునిమీద పగతో సోమనాథుని కూతు రైన లలితను కాళికాదేవికి బలి ఇచ్చి సోమనాథునిపై పగతీర్చుకోవాలనుకుంటారు. సోమనాథుడు తాగుడుకోసం ఆటవికులను వేధించడమే వారి పగకు కారణం.
తాగుబోతుల లక్షణాలను రచయిత్రి తెలియజేస్తూ- ‘త్రాగుబోతుల నడవళ్లు శోచ నీయములు. అతడొక్కొక మారు మధువును గ్రోలు చు దానిమూలమున జనించిన మైకముచే దూగుచుండును. చిరపరిచయులగు మధుపాన మిత్రులంగాంచిన, దూలుచు వారివెంట బికారివోలె దిరుగుచుండును. మితిమించిన మత్తుచే గ్రిందపడి పొరలుచుండును. దుర్భాషలనాడుచుండును. లజ్జలేక తిరుగు చుండును. అతిహేయములగు విషయములం జిక్కి యొక్కొకతఱి వెఱ్ఱివానివొలె వెడలు చుండును. వెఱ్ఱివేయివిధ ములన్నట్లాతడిట్లున్మత్తుడగుటచే చెడునడతలకడలి రక్షకభట వర్గమునుండి ప్రభుత్వమువారీతని దొలగించిరి.
ఇపుడు సోమనాథుని పిచ్చి పెచ్చుపెరిగి నితడు వీధివీధులందిరుగజొచ్చెను. చూచినవారిపై నెల్లను బాషాణములంబ్రయోగింపసాగెను. చిరపరిచితులగువారు తన్నుబ్రేమింపజొచ్చిన పలుమాఱు వారిని దిట్టుచుండెను. ఇట్లందఱికయిష్టుడై స్వ కుటుంబమునకు దూరుడై పుత్రులనెన్నక లలితయందలి ప్రీతిని దోలి, హేయ గుణపూరితుడై, తుదకాతుడు దేశముల వెంబడి దిరుగజొచ్చెను. ఆహా! మథుపా నము కుటుంబముల కెట్టియరిష్టమును దెచ్చున్నదో చూడుడు’.
సోమనాథుడి తాగుడువల్ల కూతురు చనిపోగా, భార్యను పొగొట్టుకొని పిచ్చివాడై దేశదిమ్మరి అవుతాడు. రాజమండ్రిలో ఉంటున్న లలిత పిచ్చివాడైన తండ్రిని గుర్తు పట్టి వైద్యం చేయించి మామూలు మనిషిగా చేస్తుంది. సోమనాథుడు రాజమండ్రి న్యాయస్థానంలో ఉద్యోగంచేస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. లలితకు ఇష్టంలేని సంబంధంచూసి పెళ్ళిచేసుకోవాలని బలవంతంచేస్తాడు. తన మాటలు వినని లలితపై కేసు పెడతాడు. ఓడిపోతాడు.మళ్ళీతాగుడుబోతై దేశదిమ్మరి అవుతాడు.
దేవమణి సత్యనాథన్ ‘లలిత’ నవలలో స్ర్తీ చదువుకోవాలనే సందేశాన్ని ఇచ్చారు. నిజానికి స్ర్తీ చదువు సమాజానికి, కుటుంబానికి చాలా అవసరం. ఈ నవలలో లలిత చదువుకోవడంవల్ల ప్రతి విషయంలో సమయస్పూర్తిని పాటించింది. సమ యానికి తగిన నిర్ణయాలు తీసుకొని ఆపదల నుండి గట్టెక్కింది. పట్టుదలతో తాను ప్రేమించిన బావనే పెళ్ళిచేసుకుంది దేవమణి సత్యనాథన్ సృష్టించిన లలిత పాత్ర ఆదర్శవంతమైంది. అందుకే ‘లలిత’ నవల సంఘసంస్కరణ నవల.
దేవమణి సత్యనాథన్ ‘లలిత’ నవలలో రాయలసీమ ప్రాంతానికే ప్రాముఖ్యతను ఇచ్చారు. లలిత ఉత్తర సర్కారులోని విజయనగరంలో పుట్టి అక్కడే చదువుకుం టుంది. విజయనగరంలో తల్లి, దండ్రి, అక్క, అన్నదమ్ములు అందరూ దూరమైన తర్వాత దుర్మార్గుడైన వసంతుడు పెట్టే బాధలను భరించలేక ప్రాణ,మాన పరిరక్షణకు పురుషునిగా రూపాన్ని మార్చుకొని తనబావ హరిదాసుడు ఉంటున్న కమలాపు రానికి వస్తుంది.
ఈ కమలాపురం రాయలసీమప్రాంతం బళ్ళారి జిల్లాలో ఉంది. లలిత బావ హరిదాసుడు లలితను మరచిపోలేక, తన తండ్రివల్ల ఇంట్లో స్థానం ఇవ్వలేక స్నేహితుడి సహాయంతో లలితను రహస్యంగా కమలాపురంనుండి రాజమండ్రికి చేరుస్తాడు. లలిత రాజమండ్రిలో కష్టాలను ఎదిరించి, గెలిచి చివరికి కమలాపురం చేరుకుంటుంది. అక్కడే తనబావను పెళ్ళిచేసుకుంటుంది.
లలిత విజయనగరంలో పుట్టినా, రాజమండ్రిలో కొంతకాలం నివసించినా మొత్తానికి కమలాపురమే ఆమె జీవితానికి ఆధారమైన ప్రాంతం. కాబట్టి రచయిత్రి ఈ నవలలో కమలాపురాన్నే కేంద్రంగాచేసి రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యతనిచ్చారు. దేవమణి సత్యనాథన్ రాయల సీమలో తొలి నవలారచయిత్రి ఈ ‘లలిత’ అనే సాంఘికనవల ద్వారా చెప్పవచ్చు.
-పొదిలి నాగరాజు
పరిశోధక విద్యార్థి
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప.
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప.
No comments:
Post a Comment