Tuesday, April 2, 2013

వేమనను వెలుగులోకి తెచ్చిన అబే దుబారు

'క విషయం తప్పక పేర్కొనాలి. ఈ దేశంలో ఉన్న తత్వ రచనల్లో అందులోనూ మతం, ఆచారవ్రత నియమాల గురించి సొంపుగా, నిందాగర్భంగా రాసిన వారిలో నాకు తెలిసినంత వరకూ బ్రాహ్మణుడు ఒక్కడూ లేడు. నేను విన్నవీ కన్నవీ అన్నీ శూద్రులు చేసిన రచనలే! ఈ దేశమంతటా అత్యంత విశ్రుతుడు ఒక్క వేమనే! ఈ పద్యాలు తొలుత తెలుగులో రాసినా.. ఇప్పుడవి అనేక ఇతర భాషల్లోకి అనువదించారు. ఈ దార్శనికుడు 150 ఏండ్ల లోపల కడప జిల్లాలో రెడ్ల ఇంట పుట్టినట్లు నిర్ధారణ అయినది. ఆయన పద్యాలు తత్వశాస్త్ర ధోరణిలో రాసినా, చాలా రమ్యాలు, ఆకర్షణీయాలు. దీనిలో గుర్తించవలసిన ఇంకొక గురుతర విషయం ఉంది. నాకు తెలిసినంతవరకు నేను సేకరించిన విషయాలను బట్టి దేశ ఆచార వ్యవహారాలను, మతాన్ని పరిహాసం చేసిన వేదాంతులంతా ఆధునికులే!'

- అబే దుబారు

(సంజీవనాథస్వామి అనే పేరుతో ఫ్రాన్స్‌ దేశానికి చెందిన 'లీ-గాక్‌' అనే క్రైస్తవ మత ప్రచారకుడు 1730లో వేమన పద్యాలను తొలుత సేకరించారు. వాటిని 1931లో ఫ్రాన్స్‌ దేశపు రాజు గ్రంథాలయానికి పంపారు. ఆ దేశానికి చెందిన 'అబే దుబారు' అనే కేథలిక్‌ మత బోధకుడు 1806లో 'హిందువుల ఆచారాలు' అనే పుస్తకాన్ని ఫ్రెంచ్‌ భాషలో రాశారు. దాన్ని ఈస్టు ఇండియా కంపెనీవారు ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించారు. ఇందులో వేమనను గురించి అబే దుబారు ప్రస్తావించారు. ఈ విధంగా ఇంగ్లిషు వారికి వేమన గురించి మొదటగా తెలిసింది. 1829లో ఆంగ్లేయ సివిల్‌ అధికారి చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ 'వేమన నీతి పద్యములు' పేరుతో పుస్తకం వెలువరించారు.) 
Mon.1st April 2013,     Visalandhra Daily



No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...