Wednesday, April 17, 2013

నిక్కమైన సాహిత్య చరిత్రకారుడు కల్లూరి- -అంకె శ్రీనివాస్

ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ రాయలసీమ నుండే ప్రారంభమైంది. ఆ వారసత్వం నేటికీ కొనసాగుతోంది
. కట్టమంచి రామలింగారెడ్డి నుండి ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభమైనదని తెలిసిందే. అదేవిధంగా తొలి తరం తెలుగు సాహిత్య చరిత్రకారులెైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, వంగూరి సుబ్బారావు, భోగరాజు నారాయణమూర్తి వంటివారి కృషికి కాస్త సమాంతరంగానే రాయలసీమ నుండి కూడా గొప్ప సాహిత్య చరిత్రకారులు తెలుగు చారిత్రక విమర్శ రంగస్థలం మీదికి ప్రవేశించారు. అలా ప్రవేశించిన తొలి వ్యక్తి ‘కవిత్వవేది’గా పరిచితమైన కల్లూరి వేంకట నారాయణరావు.
కల్లూరి వేంకట నారాయణరావు.

రాయలసీమలో ఆధునిక సాహిత్యం కొంత ఆలస్యంగా ఆవిర్భవించడానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలున్నాయి. అయితే ఆలస్యమై నప్పటికీ ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నింటిలో అపురూపమైన ప్రయోగాలు, అభివ్యక్తులూ జరిగాయి, జరుగుతున్నాయి. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ రాయలసీమ నుండే ప్రారంభమైంది. ఆ వారసత్వం నేటికీ కొనసాగుతోంది. కట్టమంచి రామలింగారెడ్డి నుండి ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభమైనదని తెలిసిందే. అదేవిధంగా తొలి తరం తెలుగు సాహిత్య చరిత్రకారులెైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, వంగూరి సుబ్బారావు, భోగరాజు నారాయణమూర్తి వంటివారి కృషికి కాస్త సమాంతరంగానే రాయలసీమ నుండి కూడా గొప్ప సాహిత్య చరిత్రకారులు తెలుగు చారిత్రక విమర్శ రంగస్థలం మీదికి ప్రవేశించారు. అలా ప్రవేశించిన తొలి వ్యక్తి ‘కవిత్వవేది’గా పరిచితమైన కల్లూరి వేంకట నారాయణరావుకవిత్వవేది రచించిన ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము’ నేటితరం సాహిత్య విద్యార్థులకు, సాహితీ వేత్తలకు అంతగా పరిచయం లేకపోవచ్చుగాని, ఒకప్పుడు విద్వాన్‌, ఎంఏ వంటి ఉన్నత పరీక్షలకు పాఠ్యగ్రంథంగా ఉండేది. ప్రముఖ కవి సి. నారాయణరెడ్డి తమకు ఎంఏలో పాఠ్యపుస్తకంగా వుండేదని ఒక సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకున్నారు.

కవిత్వవేది వారే రచించిన ‘19వ శతాబ్దపు ఆంధ్రవాఙ్మయ చరిత్రము’ అనే నామాంతరం కలిగిన ‘వీరేశలింగ యుగం’ అనే పుస్తకం మాత్రం 1999 నుండి 2005 వరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉంది. రాజమండ్రిలో బి.టి. చదివే రోజుల్లో అక్కడి గోదావరి ప్రవాహ ఝరి, నన్నయకు ప్రోత్సాహాన్నిచ్చిన రాజమహేంద్రపుర చరిత్ర వంటివి కవిత్వవేదికి స్ఫూర్తినిచ్చి విద్యార్థిగా ఉన్న రోజుల్లో రాసుకున్న తెలుగునోట్సే చిన్న చిన్న మార్పులతో ఆంధ్రవాఙ్మయ సంగ్రహంగా అవతరించింది. కళాశాలలో ఆంధ్రపాఠ్య పుస్తకాలెైన ఔౌ ట్చజ్టీటఛఠటడ వంటివే స్ఫూర్తి. ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహాన్ని 1928లో వావిళ్ళ రామశాస్త్రులు వంటి ప్రసిద్ధ ముద్రణాధిపతులు ముద్రించారు. కేవలం 8 సంవత్సరాలకు ద్వితీయ ముద్రణ వేయాల్సి వచ్చిందంటే ఈ గ్రంథానికి కలిగిన ఆదరణే ముఖ్య కారణం.ఈ గ్రంథం సాహిత్య చరిత్ర రచనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ప్రక్రియా భేదాలను, రాజవంశాలను కలిపి రచించారు. ఇందులో నన్నయ యుగం, తిక్కన యుగం వంటి మహాకవుల ప్రభావంవల్ల కూడా యుగవిభజన చేసినట్లుగా సూక్ష్మంగా కనిపి స్తుంది. ఈ యుగ విభజన ఆరుద్ర, జి.నాగ య్య వంటి తరువాతి చరిత్రకారులకు మార్గదర్శకమైంది. ఈ రచన మీద కందు కూరి, గురజాడ శ్రీరామమూర్తి ప్రభా వం ఉంది. కొమర్రాజు విజ్ఞాన సర్వస్వం, చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర వంటి నాటిి పరిమిత చారిత్రక ఆధారాలతోనే ఈ గ్రంథాన్ని రచించారు.

అయితే చరిత్రను, సాహిత్యాన్ని సమన్వయం చేసిన తీరు మాత్రం ముచ్చటేస్తుంది. అందుకే యుగ లక్షణ నిరూపణ చాలా స్వతంత్రంగా చేశారని చిలుకూరి నారాయణరావు పీఠికలో ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు.ప్రథమాధ్యాయంలో (ప్రథమ ఖండం) ఆంధ్రజాతి, ఆంధ్ర భాష ఆవిర్భావ వికాసాల గురించి వివరించారు. కవిత్వం, కళ వంటి వాటి గురించి సనాతన ధృక్ఫథంతోనే చర్చించారు. పాశ్చాత్య కవిత్వ సంప్రదాయాలను, అప్పటికే జన్మించి, ప్రవర్ధమానమవుతున్న ఆధునిక కవిత్వ ధృక్ఫథాన్ని ఏమాత్రం స్పర్శించలేదు. అయితే ప్రాచీన సాహిత్య అలంకారిక సైద్ధాంతిక పునాదిమీదే చర్చించినప్పటికీ పిడివాదిగా కాకుండా జాగ్రత్త పడ్డారు. కవితాశెైలి గురించి ప్రథమాధ్యాయంలో లోతుగా చర్చించిన కవిత్వవేది, తరువాతి అధ్యాయాల్లో కవుల శెైలి గురించి పెద్దగా మాట్లాడక పోవడం కొంత ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. అదేవిధంగా కవిత్వానికి ఛందస్సు ఎంతవరకు అవసరం? అన్నదానిమీద ఆసక్తికరంగా చర్చించి కవి భావనాశక్తిని పద్యం మాత్రమే నిర్ణయించలేదని సంస్కృత బాణుని కాదంబరిని గుర్తు చేశారు.

ఆనాటికి ఇలా వ్యాఖ్యానించడం చాలా గొప్ప విషయమే కాదు, ఆయన వ్యక్తిగతంగా పద్యకవి కూడా?
రావణ ఆంధ్రవ్యాకరణం క్రీ.శ. 12 శతాబ్దాలనాటికే రావడం వల్ల భాషాప్రాచీనత గురించి కొంత అంచనా వేశారు. రావణుడు అనే వెైయ్యాకరణుడు క్రీ.శ.1వ శతాబ్దిలోనే ఒకడుండేవాడనే విషయాన్ని ఆతరువాతి సాహిత్య చరిత్రకారులు ఏమాత్రం పట్టించు కోలేదు.ఈ మధ్యనే రెండు మూడు సంవత్సరాల క్రిందట వెలిదండ్ల నిత్యానందరావు లుప్తమైపోయిన రావణుని వ్యాకరణం గురించి ఒక అపురూప పరిశోధనా వ్యాసం రాశారు. ‘యాప్పరుంగలం’ అనే తమిళగ్రంథం చెప్పిన ‘వాంఛియార్‌’ (రేంచియార్‌) అనే ప్రాచీన తెలుగు లక్షణ ఛందోకారుడు ‘రేచన’ అయ్యిండవచ్చా? అనే ఒక సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కూడా తర్వాతి వారు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే కొన్ని విషయాల్లో శాస్త్రీయత కన్పించదు. నారాయణభట్టు, మల్లికార్జున పండితులకు బంధుత్వం ఉన్నదేమోనని అనుమానపడ్డారు. అందుకు ఆయన చెప్పిన కారణం వారిద్దరూ ‘వానస’ వంశస్థులు కావడం! అదేవిధంగా నన్నేచోడుని గురువు మల్లికార్జునుడు110 సంవత్సరాలు జీవించారని వ్యాఖ్యానించారు.

మల్లికార్జునుడు యోగి కాబట్టి ఎక్కువ కాలం జీవించారని సమర్థించారు. నన్నెచోడుని గురువు జంగమ మల్లికార్జునుడు, మల్లికార్జున పండితుడు వేర్వేరన్న విషయం ఆనాటికి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. ఇటువంటివి అక్కడక్కడ కనిపించినా నేల విడిచి సాము చేయలేదు. ఆనాటికి లభించిన సంక్షిప్తమైన చారిత్రక సమాచారంతో రాయడం వల్ల ఇటువంటి పొరపాట్లు జరిగాయి. అందుకే కవుల గురించి, వారి కాలం గురించి అక్కడక్కడా ఇటువంటివి కన్పిస్తాయి.
1910లో ప్రారంభమైన గిడుగు వ్యవహార భాషా ఉద్యమ ప్రభావం 1928లో కవిత్వవేది రాసిన ‘ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము’ మీద చాలా తక్కువ. గాంభీర్యమైన గ్రాంథికంలోనే రచించారు. 37 సంవత్సరాల తర్వాత 1965లో ‘వీరేశలింగ యుగము’ రాశారు. మొదటి రచనకు కొనసాగింపే తర్వాతి రచన. మొదటి గ్రంథంలో ఆధునిక సాహిత్యావిర్భావానికి కారణాలు పెద్దగా చర్చించలేదు. అందువల్లనే రెండవ రచన చేసినట్లుగా కనిపిస్తుంది. రెండు రచనల మధ్య రచయిత ధృక్ఫథంలో కొంత స్పష్టమైన మార్పు కన్పిస్తుంది.

మొదటి రచన మూర్తీభవించిన గ్రాంథికం, రెండవది సరళ గ్రాంథికం. రెండవదాని మీద గిడుగు వ్యవహారిక భాషోద్యమ ప్రభావం ఉంది. రచనలో ఒకటి రెండుసార్లు గిడుగు ప్రస్తావన కూడా కన్పిస్తుంది. సనాతన సంప్రదాయంతో మొదటి రచన చేస్తే, సామాజిక పరిణామాల్ని అవగాహన చేసుకొని రెండవ రచన చేశారు. స్థల కాలాల ప్రభావం రెండవదాని మీద చాలా ఎక్కువ. మొదటి రచనలో కనిపించే అంచనాలు రెండవదానిలో లేవు. ఖచ్చితత్వం రెండవదానిలో చాలాస్పష్టం. 18వ శతాబ్ది రెండవ అర్ధభాగం నుండి 20వ శతాబ్ది మొదటి పాతికవరకూ జరిగిన తెలుగు సాహిత్య కృషిని లోతుగా విశ్లేషించారు. అయితే ఆయన గ్రాంథికంలోనే రాసినా రెండు రచనల మీద రాయలసీమ మాండలిక ప్రభావం మాత్రం ఉంది.‘వీరేశలింగ యుగము’లో రాయలసీమపట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని కనబరిచారు. మధ్యాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని, దక్షిణాంధ్రం (రాయలసీమ), ఉత్తరాంధ్రలే వెనుకబడ్డాయని వాపోయారు.

నేటి శ్రీకృష్ణ కమిషన్‌ తేల్చింది కూడా ఇదే కదా! సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటి మహానుభావులు తెలంగాణను జాగృతం చేసినట్లు రాయలసీమను జాగృతం చేసే నాయకత్వ లేమికి బాధపడ్డారు. కట్టమంచి రామలింగారెడ్డి గొప్పస్థానంలో ఉండికూడా రాయలసీమకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇక్కడ ఒక ముఖ్యవిషయం గురించి మాట్లాడాలి. నేటి సమకాలీన సాహితీవేత్తలెైన వల్లంపాటి, సింగమనేని, రాచపాళెం వంటివారు రాయలసీమలో ఆధునిక సాహిత్యం ఆవిర్భావం ఆలస్యం కావడానికి గల కారణాల్ని ఈ మధ్యకాలంలో విశ్లేషించారు. ఇందుకుగల రెండు కారణా లను 1965లోనే కవిత్వవేది గుర్తించారు. మాడపాటి, సురవరం వంటి అభ్యుదయ ధృక్ఫథం కలిగిన నాయకులు రాయలసీ మలో లేకపోవడం ఒక కారణంగా చెప్పారు. అంతేగాక ‘ఒక పత్రికగాని, ఒక పరిషత్‌గాని, ఒక భాషోద్యమ నాయకుడుగాని, ఒక గొప్పదాతగాని రాయలసీమలో మచ్చుకైనా లేనప్పుడు ముందంజ వేయుటెట్లు?’ అనే మరో ముఖ్య కారణాన్ని కూడా తెలియజేశారు.

బండారు అచ్చమాంబను తొలితరం సాహితీ వేత్తగా ఏమాత్రం గుర్తించలేదని నేటి సమకాలీన తెలంగాణ వాదులు బాధపడడం చూస్తున్నాం. కవిత్వవేది బండారు అచ్చమాంబను 1965లోనే తమ వీరేశలింగ యుగములో ప్రత్యేకంగా కీర్తించారు.1965 నాటికి జరిగిన 20వ శతాబ్దపు సాహిత్యాన్ని కూడా క్లుప్తంగా ‘వీరేశలింగ యుగము’లో చర్చించారు. శ్రీశ్రీ ‘మహాప్రస్థాన భేరి ధ్వనులలో రాపిడి ఎక్కువెైన అగ్నిజ్వాలల్ని’ మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. శ్రీశ్రీకి అడుగుజాడెైన గురజాడనెైతే నెత్తికి ఎత్తుకున్నారు. ‘అభ్యుదయ కవితా పితామహుడని’ కొనియాడారు. రాయప్రోలు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ, కవికొండల, కరుణశ్రీ, చలం, గడియారం, దూర్భాక రాజశేఖర శతావధాని వంటి అనేకమందిని పరామర్శించి ఒక్క జాషువాను వదిలేయడం మాత్రం చాలా శోచనీయం.
ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము 1967నాటికి మూడు ముద్రణలు వేయించుకుంది. కవిత్వవేది రెండు రచనలు పునర్ముద్రణ జరగాల్సిన అవసరం ఎంతెైనా ఉంది.రాయలసీమలో కవిత్వవేది తర్వాత సాహిత్య చరిత్ర రచన చేసినవారు కల్లూరి అహోబలరావు. ‘రాయలసీమ రచయితల చరిత్ర’ పేరుతో నాలుగు సంపుటాలు వెలయించారు. ఇందులో కులం, గోత్రం, వంశం వంటి వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత సాహిత్యానికి ఇచ్చినట్లుగా కనిపించదు. కేవలం కవుల రచనలు, ఒకటిరెండు పద్యాలు ఉటంకించడంతోనే నాలుగు సంపుటాలూ కొనసాగాయి. అందువల్ల పెద్దగా జనాదరణ పొందలేదనే చెప్పాలి. వీరిద్దరి తర్వాత కూడా సాహిత్య చారిత్రక కృషి రాయలసీమనుండి గొప్పగా జరిగింది.

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...