Wednesday, April 17, 2013

కట్టమంచికి అటు, ఇటు- రాయలసీమ సాహిత్య విమర్శ-చీమల లలిత

‘కవిత్వ తత్త్వ విచారము’ వచ్చినప్పటినుంచి కట్టమంచి రామలింగా రెడ్డి మీద, ఆయన గ్రంథం మీద దాడి
జరుగుతూనే ఉంది. కాళూరి వ్యాసమూర్తి, కురుగంటి సీతా రామయ్య మొదలుకొని ఇటీవలి కోవెల సుప్రసన్నాచార్యదాకా ఈ దాడులకు పాల్పడుతూనే వచ్చారు. కట్టమంచి తొలి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు కాదు అని నిరూపించడానికి గత తొమ్మిదిన్నర శతాబ్దాలుగా సంప్రదాయవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు 140 ఏళ్లకు మించిన చరిత్ర ఉంది. 1876లో వచ్చిన కందుకూరి వీరేశలింగం పంతులు ‘విగ్రహతంత్రం విమర్శనము’ అనే గ్రంథం ఆధునిక కాలంలో వచ్చిన తొలి విమర్శ గ్రంథంగా పేరు పొందగా, కట్టమంచి రామలింగారెడ్డి 1914లో ప్రచురించిన ‘కవిత్వ తత్త్వ విచారము’ తొలి తెలుగు ఆధునిక సాహిత్య విమర్శ గ్రంథంగా పేరు పొందింది. అయితే ‘కవిత్వ తత్త్వ విచారము’ వచ్చినప్పటినుంచి కట్టమంచి రామలింగారెడ్డి మీద, ఆయన గ్రంథం మీద దాడి జరుగుతూనే ఉంది. కాళూరి వ్యాసమూర్తి, కురుగంటి సీతారామయ్య మొదలుకొని ఇటీవలి కోవెల సుప్రసన్నాచార్యదాకా ఈ దాడులకు పాల్పడుతూనే వచ్చారు. కట్టమంచి తొలి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు కాదు అని నిరూపించడానికి గత తొమ్మిదిన్నర శతాబ్దాలుగా సంప్రదాయవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
‘కవిత్వ తత్త్వ విచారము’ వచ్చినప్పటినుంచి కట్టమంచి రామలింగా రెడ్డి మీద, ఆయన గ్రంథం మీద దాడి జరుగుతూనే ఉంది. కాళూరి వ్యాసమూర్తి, కురుగంటి సీతా రామయ్య మొదలుకొని ఇటీవలి కోవెల సుప్రసన్నాచార్యదాకా ఈ దాడులకు పాల్పడుతూనే వచ్చారు. కట్టమంచి తొలి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు కాదు అని నిరూపించడానికి గత తొమ్మిదిన్నర శతాబ్దాలుగా సంప్రదాయవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.


కట్టమంచి రామలింగారెడ్డి విద్యార్థి దశలోనే 1899లో ‘కళాపూర్ణోదయం’ మీద ఆధునిక దృక్పథంతో ప్రసంగించాడు. ఆ ప్రసంగమే 1914లో ‘కవిత్వ తత్త్వ విచారము’గా రూపాంతరం చెందింది. కట్టమంచి ఈ గ్రంథంతో పాటు అనేక వ్యాసాలు, పీఠికలు రాశారు. తాను విమర్శ రాయడమేగాక తెలుగు సాహిత్య విమర్శ విస్తరించడానికి అనేకమందిని ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సహించిన వారిలో మొదటి వ్యక్తి రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ. ఆయన ‘వేమన’, ‘సారస్వతాలోకము’, ‘నాటకోపన్యాసములు’తో పాటు అసంఖ్యాకంగా పీఠికలు రచించారు. ఆయన తర్వాత ఆ మార్గంలో ప్రయాణించిన విమర్శకులు పుట్టపర్తి నారాయణాచార్యులు. ఇప్పటిదాకా తెలుగు సాహిత్య విమర్శ అధ్యయనం రాయలసీమ పరిధిలో ప్రధానంగా కట్టమంచి, రాళ్లపల్లి ఈ ఇద్దరి చుట్టే తిరిగింది. కొంతవరకు పుట్టపర్తి అధ్యయనం కూడా జరిగింది.

అయితే రాయలసీమ నుంచి వచ్చిన సాహిత్య విమర్శ ఇంత మాత్రమే కాదు. కట్టమంచికి ముందు- వెనుక ఇంకా చాలా ఉంది. ప్రారంభం నుంచి 1950 దాకా రాయలసీమ సాహిత్య విమర్శ తొలిదశగా గుర్తిస్తూ పైన పేర్కొన్న ముగ్గురికన్నా మించి జరిగినదేమిటో పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశం. నిజానికి తెలుగు సూర్యుడుగా పేరుపొందిన సి.పి బ్రౌన్‌ వేమన పద్యాలను వెలికి తీసి, వాటిని ఆంగ్లంలోకి అనువదించి, ముందు మాటలు రాయడంతో రాయలసీమ సాహిత్య విమర్శ ప్రారంభమైందని భావించవచ్చు. బ్రౌన్‌ ఈ పనిని 1924-29 మధ్య చేశారు. ఆయన కడప నుంచి పండితుల సహాయంతో గ్రంథ పరిష్కరణ శాస్త్రాన్ని అభివృద్ధి పరిచారు. నిఘంటువులు రూపొందించి, వాటిలో వ్యవహారిక పదాలను చేర్చారు. ఛందస్సు, వ్యాకరణం మీద కృషి చేశారు. వేమన పద్యాల సంకలనాలకు ఆయన రాసిన ముందుమాటలు ఆయన కవిత్వ పరిశీలనాసక్తిని తెలియజేస్తున్నాయి.

రాయలసీమలో పుట్టిన తొలి విమర్శకుడు రొద్దం హనుమంతరావు. ఈయన అనంతపురం జిల్లావాసి. ఈయన 1894-1947 మధ్య కొన్ని వ్యాసారాలు రాశారు. అముద్రిత గ్రంథ చింతామణిలో 1894 సంవత్సరం డిసెంబరు నెల సంచికలో అనంతపురం జిల్లాకు చెందిన రొద్దం హనుమంతరావు ‘బిల్వేశ్వరీయ కృతి విమర్శనము’ అనే వ్యాసాన్ని రాశారు. ఇది ప్రసిద్ధ గ్రాంథిక భాషావాది కొక్కొండ వేంకటరత్నం పంతులు రాసిన ‘బిల్వేశ్వరీయ’ కావ్యాన్ని నిశితంగా విమర్శించిన వ్యాసం. బిల్వేశ్వరీయ కావ్యాన్ని భారతం, మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైన రచనలతో పోల్చి ఇతివృత్తం, వర్ణన, పద్యం, శైలి, ఛందస్సు మొదలైన అంశాలలో కనిపించే లోపాలను ఎత్తి చూపారు. రొద్దం వారి వ్యాసాన్ని ఖండిస్తూ పి. నరసయ్య, దుర్ముఖి సంవత్సరం, శ్రావణ మాసంలో కొక్కొండ వేంకటరత్నం పంతులు సంపాదకత్వంలో వస్తున్న ‘శ్రీ మదాంధ్ర భాషా సంజీవని’ పత్రికకు ఒక లేఖ రాశారు. దానికి స్పందిస్తూ అదేపత్రికలో రొద్దం హనుమంతరావు ‘శ్రీ మదాంధ్రభాషా సంజీవనీ విమర్శనం’ అనే వ్యాసం రాశారు. నరసయ్యలాంటి వారి సహాయంతో కొక్కొండ ప్రతిపక్షాలవారిపై దండెత్తుతున్నాడని కూడా ఆక్షేపించాడు.

‘వాసుదాసు’గా పేరుపొందిన వావిలికొలను సుబ్బారావు రాసిన కావ్యం ‘కుమారాభ్యుదయము’. ఈ కావ్యంమీద 1897 ఫిబ్రవరిలో రొద్దం హనుమంతరావు ‘కుమారాభ్యుదయ కృతి విమర్శనము’ అనే వ్యాసం రాస్తూ అందలి గుణదోష విచారణ చేశారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము’ను వేదం వెంకటరాయశాస్త్రి ‘ఆంధ్రాభిజ్ఞానశాకుంతలము’గా అనువదించారు. దీనిమీద రొద్దం హనుమంతరావు ‘ఆంధ్రాభిజ్ఞాన శాకుంతలకృతి విమర్శనము’ అనే పేరుతో లేఖ రాశారు. ఇది ప్రశంసాపూర్వకమైన అభిప్రాయం. ఆముద్రిత గ్రంథ చింతామణి ‘మయూఖము’ అనే శీర్షికలో వెలువరించిన లేఖలే శ్రీమధాంధ్ర భాషా సంజీవనీ విమర్శనము, ‘ఆంధ్రాభిజ్ఞాన శాకుంతలకృతి విమర్శనము’.

కోలాచలం శ్రీనివాసరావు తన తొమ్మిదవ సంవత్సరంలో హంపి దగ్గరున్న కమలాపురం నుంచి 1863లో రాయలసీమ సాంస్కృతిక రాజధానైన బళ్లారికి వచ్చారు.1895వ సంవత్సరంలో ‘సునందనీ పరిణయము’ అనే నాటకాన్ని ప్రచురించారు. వీరినాటకాన్ని అముద్రిత గ్రంథ చింతామణి పత్రికాధిపతి అయిన పూండ్ల రామకృష్ణయ్య అదే సంవత్సరం విమర్శించారు. దానికి సమాధానంగా కోలాచలం శ్రీనివాసరావు 1895 అక్టోబర్‌ 16వ తేదీన ఒక చిన్న పుస్తకాన్ని రచించారు. (కోలాచలం శ్రీనివాసరావు సంగ్రహజీవిత చరిత్ర19వ పేజి) మళ్ళీ పూండ్ల రామకృష్ణయ్య 1896 ఏప్రిల్‌లో అముద్రిత గ్రంథ చింతామణిలో ఆ గ్రంథం మీద విమర్శ చేశారు. వీరి మరో నాటకం ‘సుఖమంజరీ పరిణయము’.

దీనిని 1897లో పూండ్ల అముద్రిత గ్రంథ చింతామణిలో విమర్శించగా, దానికి సమాధానం ‘శశిరేఖ’ పత్రికలో (ఎస్‌. గంగప్ప, కోలాచలం శ్రీనివాసరావు సంగ్రహజీవిత చరిత్ర, పేజి19) సమాధానమిచ్చారు. కోలాచలం శ్రీనివాసరావు ‘ఖీజ్ఛి ఈట్చఝ్చ్టజీఛి ఏజీటౌ్టటడ ౌజ ్టజ్ఛి గిౌటజూఛీ‘ (ప్రపంచ నాటక చరిత్రము) అనే విమర్శనా గ్రంథాన్ని ఆంగ్ల భాషలో 1908లో ముద్రించారు. ఈ గ్రంథాన్ని రెండు భాగాలుగా చేసి ప్రపంచ నాటక చరిత్రము, నాటక లక్షణాలు మొదలైన వాటిని గురించి వివరించారు.అంతేగాక వేదాలు, భారతం, భాగవతం మొదలైన వాటి గురించి వ్యాసాలు రాశారు.

వీటిని ఆధారంగా చేసుకొని రాయలసీమలో సాహిత్య విమర్శకు సిపి బ్రౌన్‌ తర్వాత పునాదులు వేసిన వారు విమర్శకులు రొద్దం హనుమంతరావు, కోలాచలం శ్రీనివాసరావు అని చెప్పవచ్చు. 19వ శతాబ్ది చివరి రోజుల్లో ఈ కృషి జరిగింది. 1914లో కట్టమంచి ‘కవిత్వ తత్త్వ విచారము’తో తెలుగు సాహిత్య విమర్శనాన్ని ఆధునిక మార్గం పట్టించిన విషయం ఇప్పటికే బాగా స్పష్టమైంది. ఆ తర్వాత ‘వ్యాస మంజరి’ (1947) వచ్చింది.1950లో కట్టమంచి రాసిన ఐదు వ్యాసాల సంకలనమే ‘పంచమి’. ఆయన మరణించిన తర్వాత 1983లో ఆయన పీఠికలు ఒక పుస్తకంగా వచ్చాయి.

కట్టమంచి చేసిన ఈ మొత్తం కృషి తెలుగు సాహిత్య విమర్శ ప్రయాణాన్ని నిర్దిష్ఠం చేసింది. ఇందులో ఆయన అధ్యక్షోపన్యాసం, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడానికి బాటలు వేసింది. ఆ వ్యాసంలోని ఆయన అభిప్రాయాలనే తర్వాత మార్క్సిస్టులు అంది పుచ్చుకున్నారు. కట్టమంచి సామాజికవాదే కానీ మార్క్సిస్టు కాదు. అయినా ఆయన విమర్శ పద్ధతి మార్క్సిస్టు సాహిత్య విమర్శకు తోడ్పడింది. ముఖ్యంగా ‘దేశ చరిత్రము, భాషా చరిత్రము నిత్య సంయోగములు’ వంటి సూత్రాలు ఏ భావజాలం కలిగిన విమర్శకులకైనా నేటికీ అనుసరణీయాలుగా ఉన్నాయి.

కట్టమంచి ప్రోత్సాహంతో ఆయన శిష్యప్రాయుడుగా తెలుగు సాహిత్యరంగంలోకి ప్రవేశించిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ స్వీయ వ్యక్తిత్వం గల విమర్శకుడిగా ఎదిగారు. ‘వేమన’ అనే గ్రంథంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఇవాళ కూడా అనేకులు పునరుద్ఘాటిస్తు న్నారు. 1928 అక్టోబర్‌లో రాళ్ళపల్లి వేమన మీద వరుసగా ఏడు రోజులు అనంతపురం కళాశాలలో చేసిన ప్రసంగాలే ‘వేమన’. ఒక కవి నివసించిన సమాజానికి ఆ కవి సాహిత్యానికి సమన్వయం చెబుతూ విమర్శరాసే పద్ధతికి రాళ్లపల్లి శ్రీకారం చుట్టారు.

‘సారస్వతాలోకనము’ వ్యాసాలు 1931-1949 మధ్య వచ్చాయి. అంతా చదివితే- తెలుగు ప్రబంధ సాహిత్యం కొందరు భావించినట్లుగా శూన్యంలోనుంచి పుట్టలేదని, అప్పటి సామాజిక పరిస్థితుల్లోనుంచే పుట్టిందని ఆయన సిద్ధాంతం చేసినట్లు అర్థమవుతుంది. కట్టమంచిని గౌరవిస్తూనే- ఆయన ప్రతిపాదించిన సహజత్వ సిద్ధాంతాన్ని వినయంగా వ్యతిరేకించినట్లు రాళ్లపల్లి నాటకోపన్యాసాలు రుజువు చేస్తాయి. కట్టమంచి, రాళ్లపల్లి- ఈ ఇద్దరి విమర్శనాకృషి తెలుగులో రెండు పాయలకు పునాది వేసినట్లుగా భావించవచ్చు.

1913లో పానుగంటి లక్ష్మీ నరసింహరావు ’సాక్షి’ వ్యాసాలు తెలుగు సృజనేతర సాహిత్య ప్రక్రియలలో సంచలనం సృష్టించాయి. అందులో అనేక భాషా సాహిత్యాంశాలు కూడా చర్చకు వచ్చాయి. అంత ప్రాచుర్యం రాలేదు కానీ, అనంతపురం జిల్లానుంచి ‘శ్రీసాధన’ పత్రిక సంపాదకులు పప్పూరు రామాచార్యులు రాసిన ‘వదరు బోతు’ వ్యాసాలు సాక్షివ్యాసాలను తలపిస్తాయి. ఈ వ్యాసాల కర్త ృత్వంలో పప్పూరు రామాచార్యులతో పాటు రాళ్లపల్లి సోదరుల (గోపాలకృష్ణమాచార్యులు, అనంతకృష్ణశర్మ) ప్రమేయం కూడా ఉందంటారు.

‘సాక్షి’ వ్యాసాలు వచ్చిన మూడు నాలుగేళ్లకే 1917వ సంవత్సరంలో ‘వదరుబోతు’ వ్యాసాలు కూడా వచ్చాయి. ఈ వ్యాసాలలో సాహిత్యానికి సంబంధించిన అంశాలుకూడా ఉన్నాయి. పాండిత్యం తప్ప ప్రపంచం తెలియని విద్వాంసులు, తెలుగులో అప్పటికే పెరుగుతున్న బిరుదుల వ్యామోహం వంటి అంశాలను ఈ వ్యాసకర్త విమర్శించారు. అలాగే కవిత్వ రచనకు కావాల్సిన సామాగ్రిని గురించి, నాటక రచనను గురించి కూడా చర్చించారు.

1935 ఫిబ్రవరి 16వ తేదీ తెలుగు సాహిత్య విమర్శ చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే, బళ్లారి రాఘవ భారతదేశ పతనానికి పదకొండు కారణాలు అనే అంశం మీద రాజమండ్రి ట్రైనింగ్‌ కళాశాలలో ఆరుగంటల సేపు ఏకబిగిన ఆంగ్లంలో ప్రసంగించటం. గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం తన శిష్యుడు వెంకటేశంతో తనను గురించి గొప్పలు చెప్పుకొంటూ, పూణే డెక్కన్‌ కాలేజీలో ‘భారత దేశ పతనానికి పదకొండు కారణాలు’ అనే అంశం మీద ఏకబిగిన మూడు గంటలు లెక్చర్‌ ఇచ్చానని, ఆ లెక్చర్‌ విని అక్కడి ప్రొఫెసర్లు డంగయిపోయారని చెబుతాడు.

అయితే భారత దేశ పతనానికి గిరీశం చెప్పిన పదకొండు కారణాలు ఏమిటో ఎవరికీ తెలియదు. కన్యాశుల్కం నాటకం మీద పరిశోధనలు చేసిన వారు కానీ, విమర్శలు చేసిన వారుకానీ దీని గురించి ఏమీ చెప్పలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా ఉండిన కట్టమంచి రామలింగారెడ్డి ఈ అంశంమీద పరిశోధించి ప్రసంగించే బాధ్యతను బళ్లారి రాఘవకు అప్పజెప్పాడు. తర్వాత 59 సంవత్సరాలపాటు అజ్ఞాతంగా ఉన్న ఈ వ్యాసం 1994లో ఆవంత్స సోమసుందర్‌ అనువదించడంతో వెలుగులోకి వచ్చింది. గిరీశం ఏకబిగిన మూడు గంటలు ప్రసంగించాడో లేదో కానీ బళ్లారి రాఘవ మాత్రం ఆరు గంటలు ఆంగ్లంలో ప్రసంగించారు. ఈ ప్రసంగం- సాహిత్యం సామాజిక అధ్యయనానికి ఎలా ఉపయోగపడగలదో రుజువు చేసింది.

తెలుగులో వచ్చినటువంటి తెలుగు సాహిత్య చరిత్రల్లో శాస్త్రీయ సూత్రాల మీద ఆధారపడి వచ్చిన తొలిగ్రంథం కల్లూరు వెంకట నారాయణరావు రాసిన ‘ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము’ అని అనేకులు పేర్కొన్నారు. ప్రాచీన యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం అని మూడు విభాగాలుగా తెలుగు సాహిత్యాన్ని విభజించి సమాజ చరిత్రకు- సాహిత్య చరిత్రకు గల అవినాభావ సంబంధాన్ని రుజువు చేసిన మొదటి విమర్శ గ్రంథం ఇది. ఈ గ్రంథం 1928లో వచ్చింది. కవుల పేరు మీద, రాజుల పేరు మీద యుగ విభజన చేయకపోవడమే ఈ గ్రంథ మౌలికత. ఈయన అనంతపురం వాసి.

1929లో శ్రీకాకుళం ప్రాంతంనుండి అనంతపురం చేరిన తొలి తెలుగు పి.హెచ్‌.డి. పట్టాదారుడు చిలుకూరి నారాయణరావు గొప్ప పరిశోధకుడు, విమర్శకుడు కూడా. ఈయన 1950 లోపలే హిందీ, సంస్కృతం, తమిళ, కన్నడ, గుజరాతీ సాహిత్య చరిత్రలు రాశారు. ఇతర భారతీయ భాషా సాహిత్య చరిత్రలను అధ్యయనం చేయడం రాయలసీమలో అప్పటికే మొదలయినట్లు గుర్తించాలి.

ప్రసిద్ధ పరిశోధక విమర్శకులు వేటూరి ప్రభాకర శాస్త్రి 1939లో మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో పండిత పదవిని ముగించుకొని 1940లో శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్‌ రీసెర్చి ఇనిస్టిట్యూటు తెలుగు శాఖాధిపతిగా చేరారు.అనేక పరిశోధనలు చేశారు. విమర్శలు రాశారు. ‘తెలుగు మెరుగులు’, ‘మీగడ తరగలు’, ‘సింహావలోకనం’ అనే వేటూరి గ్రంథాలను టిటిడి ప్రచురించింది. అందులో అనేక భాషా సాహిత్యాంశాలను ఆయన చర్చించారు.

కడపజిల్లా వాసి అయిన జనమంచి శేషాద్రి శర్మ కవి, అనువాదకుడు, విమర్శకుడు. ఈయన 1937లో అల్లసాని పెద్దన మనుచరిత్ర మీద ‘మనుచరిత్ర- హృదయావిష్కరణ’ అనే పేరుతో విమర్శ గ్రంథాన్ని రాశాడు. అల్లసాని పెద్దన నివాస స్థలాన్ని గురించిన చర్చ చేసి మనుచరిత్రలో పెద్దన వర్ణించిన ప్రకృతి హిమాలయ పర్వతాలది కాదు, పెద్దన నివాస స్థలానిదే అని స్పష్టం చేశాడు.
అనంతపురం జిల్లానుంచి వచ్చి కడప జిల్లాలో స్థిరపడిన సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు 1950లో ‘ప్రబంధ నాయికలు’ అనేపేరుతో గొప్ప విమర్శ రాశారు. వరూధిని, సత్యభామ, గిరిక, ప్రభావతి- ఈ నలుగురిని ఆయా కవులు ఎలా చిత్రించినదీ పుట్టపర్తి విశ్లేషించారు. ఈ వ్యాసాల్లో పుట్టపర్తి ప్రభావవతిని తప్ప ముగ్గురిని అమోదించినట్లు కనిపిస్తుంది.

పుట్టపర్తి కనకమ్మ ‘వాల్మీకి ప్రకృతి వర్ణనలు’ అనే ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఇది- రాజమహేంద్రవరంలోని ‘ఆంధ్ర యువతీ కళాశాల’లో ఆనాటి కార్యాధికారిగా ఉన్న ‘శ్రీమతి బత్తుల కామాక్షమ్మ షష్టిపూర్తి అభినందన సంచిక’లో మార్చి 1947వ సంవత్సరంలో ప్రచురితమైంది. ఇందులో వాల్మీకి రచనా వ్యాసంగం ఎలా ప్రారంభమైంది మొదలు అతని రచనా విశేషాలు, శైలి, అలంకారాలు, ఉపమాలంకార ప్రియత్వం, ఉపమాలంకారాల రకాలు మొదలైన వాటిని గురించి ఆమె పరామర్శించారు.

కర్నూలు జిల్లా పాండ్యం నివాసి అయిన భూపతి లక్ష్మీ నారాయణరావు 1949లో ‘భారతము తిక్కన రచన’ అనే విమర్శన గ్రంథాన్ని, మరికొన్ని వ్యాసాలను రచించారు. ఇందులో తిక్కన రాసిన పదహైదు పర్వాల భారతాన్ని నిశిత పరిశీలన చేశారు. భూపతి లక్ష్మీనారాయణ రావు, పదుహైదు పర్వాలలో విరాటపర్వానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. ఈ పర్వం కంటే తిక్కన కవితా ప్రతిభ యుద్ధ, శాంతి, మౌసల పర్వాలలో ఎక్కువగా కనిపిస్తుంది.అయితే విరాటపర్వంలాగా ఈ పర్వాలు ప్రాచుర్యం పొందక పోవడానికి గల కారణాలను ఇందులో పేర్కొన్నారు, భూపతి.
ఈ సమాచారాన్నంతా క్రోడీకరించి ఆలోచిస్తే రాయలసీమ నుంచి వచ్చిన తెలుగు సాహిత్య విమర్శ సిపి బ్రౌన్‌తో మొలకెత్తి, రొద్దం హనుమంతరావు, కోలాచలం శ్రీనివాసరావులతో పనలు తొడిగి, కట్టమంచితో తీగలు సాగి, ఆతర్వాత 1950లోపల పుష్ప ఫలవంతమైందని చెప్పవచ్చు.
అయితే ఈ అర్ధశతాబ్ది రాయలసీమ సాహిత్య విమర్శ అంతా ఒక భావజాలంతో వచ్చింది కాదని కూడా గుర్తించాలి. ఎక్కువ భాగం సంప్రదాయ మార్గంలో, పరిమిత భాగం ఆధునిక మార్గంలో వచ్చింది. గురజాడ ప్రగతిశీల మార్గం తాత్కాలికంగా మౌనం వహించి అభ్యుదయ సాహిత్యంద్వారా పునరుజ్జీవనం పొందినట్టే! కట్టమంచి మార్గం వెంటవెంటనే వేగవంతం కాకుండా కొంత నెమ్మదించి రాయలసీమను అభ్యుదయ సాహిత్యం తాకడంతో పునరుజ్జీవనం పొంది విస్తరించింది. ఇది రాయలసీమ తెలుగు సాహిత్య విమర్శ చరిత్రలో తొలిదశ. 
-చీమల లలిత
పరిశోధక విద్యార్థిని
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప. 

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...